Bus Accident: చేవెళ్ల ఘటన మరువక ముందే మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం..
- చేవెళ్ల ఘటన మరువక ముందే మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం..
- ముత్తంగి జాతీయ రహదారిపై డివైడర్ పై ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన బస్సు..
- ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు, పలువురికి స్వల్ప గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Accident: చేవెళ్లలో ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటన మరిచిపోక ముందే, సంగారెడ్డి జిల్లాలో మరో ఆర్టీసీ బస్సుకి ప్రమాదం చోటు చేసుకుంది. ముత్తంగి జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మేడ్చల్ నుంచి బాలానగర్ మీదుగా ఇస్నాపూర్ వరకు వస్తోంది. ముత్తంగి జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కార్లను తప్పించబోయే క్రమంలో, బ్రేక్ పడకపోవడంతో బస్సు నియంత్రణ కోల్పోయింది. దీంతో బస్సు వేగంగా డివైడర్ ఎక్కి, పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ లక్ష్మయ్య, కండక్టర్ లక్ష్మయ్యతో పాటు కొందరి ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి.
Read Also: Mumbai: పట్టాలు తప్పిన మోనోరైలు.. గాల్లో మొదటి కోచ్ (వీడియో)
Also Read
- Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
- Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
- BJP Sangareddy : బీజేపీ శిక్షణ శిబిరంలో రచ్చ.. జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం.!
- Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
ఇక, సమాచారం అందుకున్న వెంటనే పటాన్చెరు పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక లోపమే కారణమా?.. లేదా డ్రైవర్ అతి వేగమా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. అయితే, గత కొద్ది రోజులుగా తమ బస్సుకు సాంకేతిక లోపాలు ఉన్నాయని డ్రైవర్ లక్ష్మయ్య ఇప్పటికే ఉన్నతాధికారులకు తెలిపినట్లు తెలుస్తుంది. బ్రేకుల్లో లోపం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Yuvraj Singh: 2027 వరల్డ్కప్కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
-
Numerology: ఈ తేదీల్లో పుట్టినవారికి ఏకాంతమే ఇష్టం! సంఖ్యాశాస్త్రం ఏమి చెబుతోందంటే ?
-
Sugar Shortage: దేశంలో చక్కెర కొరతా..? ధరలు పెరుగుతాయా..? క్లారిటీ ఇచ్చిన AISTA
-
Mercedes-Benz AMG E 53: మెర్సిడెస్ బెంజ్ AMG E 53 విడుదల.. 3.8 సెకన్లలో 100 kmph స్పీడ్.. ధర ఎంతంటే?
-
Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
ట్రెండింగ్
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!