Sabitha Indra Reddy: బాసర ఐఐఐటీపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక సమీక్ష
గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక విద్యను అందించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన బాసర ట్రిపుల్ ఐ టి లో భవిష్యత్ లో సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ఇంచార్జి వైస్ ఛాన్సలర్ ను ఆదేశించారు. సోమవారం నాడు బాసర ట్రిపుల్ ఐ టి పై తన కార్యాలయంలో సమీక్షించారు. విద్యార్థులకు గతంలో హామీ ఇచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధులను ఇప్పటికే మంజూరు చేశామని మంత్రి తెలిపారు. బోధన, భోజన, వసతి పరంగా భవిష్యత్ లో సమస్యలు ఉత్పన్నం కాకుండా విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరారు. విద్యార్థుల సంక్షేమం కోసం అధికారులు తీసుకునే చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.
Presidential Election 2022: ముగిసిన పోలింగ్.. 99.18% ఓటింగ్ నమోదు
Also Read
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీలో నెలకొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అక్కడి సమస్యలను ఎన్టీవీ వెలుగులోకి తెచ్చింది. ఈ సమస్యలు పరిష్కరించాలంటూ గత నెలలో సుమారు వారం రోజుల పాటు స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వివిధ పార్టీలు విద్యార్ధుల ఆందోళనకు మద్దతు పలికాయి. విద్యార్ధులతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని హమీ ఇచ్చింది. స్వయంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్ధులకు హామీ ఇవ్వడంతో స్టూడెంట్స్ ఆందోళన విరమించారు.
ఇదంతా అయిపోయాక మళ్ళీ బాసర ఐఐఐటీ వార్తల్లోకి వచ్చింది. ఈసారి కలుషిత ఆహారం తిని విద్యార్ధులు అస్వస్థతకు గురి కావడంతో అక్కడ ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం అయింది. ఇది ముగిశాక అక్కడ రెగ్యులర్ వీసీ స్థానంలో ఇన్చార్జ్ వీసీని నియమించింది ప్రభుత్వం. దీనిపై విద్యార్ధిలోకం భగ్గుమంది. విద్యార్ధులు నిరసనకు దిగారు. తాము కోరుకున్నది ఇన్చార్జ్ వీసీ కోసం కాదని రెగ్యులర్ పీసీ కోసమని విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనిఫామ్స్, మెస్ కాంట్రాక్ట్ రద్దు, ల్యాప్టాప్లు, ఛాన్స్లర్ల భర్తీ వంటి ప్రధాన డిమాండ్లు పరిష్కారం కాలేదని, అవి పరిష్కారం అయ్యేందుకు ఈ నెల 24వ తేది వరకు గడువు విధించారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే 25వ తేదీ నుంచి పెద్ద ఎత్తున ఆందోళన తప్పదని విద్యార్ధులు వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ ముందు వైఎస్ ఆర్ టీపీ నాయకులు ధర్నాకు దిగారు. ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్ళే క్రమంలో ప్రధాన గేటు వద్ద నాయకులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు..దీంతో గేటు ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు విద్యార్ధి సంఘ నేతలను అరెస్ట్ చేశారు. ఈక్రమంలో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది.
NEET 2022: ఇవేం చర్యలు..? అమ్మాయిల లో దుస్తులు కూడా విప్పించారు
తాజావార్తలు
-
Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
-
Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
-
Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో