Sabitha Indra Reddy: బాసర ఐఐఐటీపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక విద్యను అందించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన బాసర ట్రిపుల్ ఐ టి లో భవిష్యత్ లో సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ఇంచార్జి వైస్ ఛాన్సలర్ ను ఆదేశించారు. సోమవారం నాడు బాసర ట్రిపుల్ ఐ టి పై తన కార్యాలయంలో సమీక్షించారు. విద్యార్థులకు గతంలో హామీ ఇచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధులను ఇప్పటికే మంజూరు చేశామని మంత్రి తెలిపారు. బోధన, భోజన, వసతి పరంగా భవిష్యత్ లో సమస్యలు ఉత్పన్నం కాకుండా విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరారు. విద్యార్థుల సంక్షేమం కోసం అధికారులు తీసుకునే చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.
Presidential Election 2022: ముగిసిన పోలింగ్.. 99.18% ఓటింగ్ నమోదు
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీలో నెలకొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అక్కడి సమస్యలను ఎన్టీవీ వెలుగులోకి తెచ్చింది. ఈ సమస్యలు పరిష్కరించాలంటూ గత నెలలో సుమారు వారం రోజుల పాటు స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వివిధ పార్టీలు విద్యార్ధుల ఆందోళనకు మద్దతు పలికాయి. విద్యార్ధులతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని హమీ ఇచ్చింది. స్వయంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్ధులకు హామీ ఇవ్వడంతో స్టూడెంట్స్ ఆందోళన విరమించారు.
ఇదంతా అయిపోయాక మళ్ళీ బాసర ఐఐఐటీ వార్తల్లోకి వచ్చింది. ఈసారి కలుషిత ఆహారం తిని విద్యార్ధులు అస్వస్థతకు గురి కావడంతో అక్కడ ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం అయింది. ఇది ముగిశాక అక్కడ రెగ్యులర్ వీసీ స్థానంలో ఇన్చార్జ్ వీసీని నియమించింది ప్రభుత్వం. దీనిపై విద్యార్ధిలోకం భగ్గుమంది. విద్యార్ధులు నిరసనకు దిగారు. తాము కోరుకున్నది ఇన్చార్జ్ వీసీ కోసం కాదని రెగ్యులర్ పీసీ కోసమని విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనిఫామ్స్, మెస్ కాంట్రాక్ట్ రద్దు, ల్యాప్టాప్లు, ఛాన్స్లర్ల భర్తీ వంటి ప్రధాన డిమాండ్లు పరిష్కారం కాలేదని, అవి పరిష్కారం అయ్యేందుకు ఈ నెల 24వ తేది వరకు గడువు విధించారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే 25వ తేదీ నుంచి పెద్ద ఎత్తున ఆందోళన తప్పదని విద్యార్ధులు వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ ముందు వైఎస్ ఆర్ టీపీ నాయకులు ధర్నాకు దిగారు. ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్ళే క్రమంలో ప్రధాన గేటు వద్ద నాయకులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు..దీంతో గేటు ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు విద్యార్ధి సంఘ నేతలను అరెస్ట్ చేశారు. ఈక్రమంలో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది.
NEET 2022: ఇవేం చర్యలు..? అమ్మాయిల లో దుస్తులు కూడా విప్పించారు
తాజావార్తలు
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!