Presidential Election 2022: ముగిసిన పోలింగ్.. 99.18% ఓటింగ్ నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Presidential Election 2022 Ends – Result To Be Out On July 21: సోమవారం ఉదయం ఢిల్లీలోని పార్లమెంట్లో మొదలైన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ భవనంలో 99.18 శాతం ఓటింగ్ నమోదైనట్లు తేలింది. పార్లమెంటులో ఓటు వేసేందుకు 736 మంది ఓటర్లకు (727 మంది ఎంపీలు, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు) అనుమతి ఉండగా.. 730 మంది (721 ఎంపీలు, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు) ఓటు వేశారు. ఓవరాల్ ఎంపీల సంఖ్య 776 కాగా.. కొందరు సొంత రాష్ట్రాల నుంచి ఓట్లు వేశారు.
పార్లమెంట్లో ఓటింగ్ మొదలైన వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓటేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సైతం పార్లమెంట్ భవన్లో ఓటేశారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ వీల్ఛైర్లో వచ్చి తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. కేంద్రమంత్రులు, ఎంపీలు సహా తెలంగాణ, ఏపీ ఎంపీలు కూడా ఓటు వేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో విషయానికొస్తే.. 95 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. ఏపీలో ఇద్దరు, తెలంగాణ ఇద్దరు ఓటు వేయలేదు. ఏపీలో నందమూరి బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి విదేశాలకు వెళ్లడంతో ఓటింగ్కు హాజరు కాలేదు. తెలంగాణలో చెన్నమనేని రమేష్ విదేశాలకు వెళ్లడంతో, మంత్రి గంగుల కమకలార్కు కరోనా రావడంతో ఓటు వేయలేదు.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
జూలై 21వ తేదీన పార్లమెంట్ హాల్లో ఓట్లు లెక్కించి, ఫలితాలను వెల్లడిస్తారు. గెలిచిన అభ్యర్థి జూలై 25వ తేదీన తదుపరి రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పోటీ పడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ముర్ముకు క్రాస్ ఓటింగ్ చేసినట్టు తెలిసింది. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముదే విజయం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..