Sabitha Indra Reddy: ఇంటర్మీడియట్ విద్యపై మంత్రి సబిత సమీక్ష.. వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabitha Indra Reddy Review Meeting On Intermediate Education: మంగళవారం ఇంటర్మీడియట్ విద్యపై సమీక్ష నిర్వహించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కాలేజీల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. కాలేజీల్లో అవసరమైన కొత్త భవనాలు, అదనపు గదులు, టాయిలెట్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.60 కోట్లు మంజూరు చేసినా.. విద్యా సంవత్సరం ఆరంభం నాటికి పనులు పూర్తి చేయకపోవడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నుంచి ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్షించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్కు ఆదేశాలు జారీ చేశారు. కాలేజీ నిర్వహణ అవసరాలు, ల్యాబ్ల ఆధునికీకరణ పనుల కోసం మరో రూ.4.43 కోట్లు మంజూరు చేశామని.. ఈ పనులన్నీ వెంటనే చేపట్టాలని చెప్పారు. విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు అందకపోవడంపై కూడా సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆపరేటర్ల సహాయంతో.. శుక్రవారం నాటికి పుస్తకాలను వివిధ జిల్లాలకు సరఫరా చేయాలని సూచించారు.
Padi Kaushik Reddy: ఈటల రాజేందర్కి ఎమ్మెల్సీ కౌశిక్ సూటి ప్రశ్న.. సమాధానం చెప్పాలని డిమాండ్
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ఇదే సమయంలో.. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కాలేజీల్లో ప్రవేశాల సంఖ్య తగ్గిందనే ఆరోపణల్ని మంత్రి సబిత ఖండించారు. దేశంలోనే ప్రప్రథమంగా ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను తెలంగాణ రాష్ట్రంలోనే ఉచితంగా అందిస్తున్నామని.. ప్రవేశాల సంఖ్య ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశారు. 119 జ్యోతిరావు పూలే పాఠశాలలను, 38 కెజీబీవీలను, 2 గిరిజన గురుకులాలను ఇంటర్మీడియేట్ వరకు అప్గ్రేడ్ చేశామని అన్నారు. వీటిలో కొంతమంది విద్యార్థులు చేరారన్నారు. ప్రవేశాల తుది గడువు ఇంకా పూర్తి కాలేదని, గడువు ముగిసే నాటికి గత సంవత్సరంతో పోలిస్తే అధిక ప్రవేశాలు జరుగుతాయని తెలిపారు. అయితే.. మారుమూల జిల్లాల్లో విద్యార్థులు అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధిస్తుండగా.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి జిల్లాల్లో ప్రభుత్వ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ వహించి.. ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.
Suicide Blast: పాకిస్థాన్లోని పెషావర్లో ఆత్మాహుతి దాడి.. ఆరుగురికి గాయాలు
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?