హైదరాబాద్లో ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు.. కారణం అదేనా..?
హైదరాబాద్ వేదిక ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు జరగబోతున్నాయి.. ఇవాళ్టి నుంచి అంటే జనవరి 5 నుండి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ జాతీయ సమావేశాలు జరుగుతోంది.. ఈ సమావేశాలకు ఆర్ఎస్ఎస్ సర్ సంచాలక్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఇక, ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హైదరాబాద్ చేరుకున్నారు.. ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో దేశంలో జరుగుతున్న అనేక ఘటనలపై కీలక చర్చ జరగబోతోంది. ఈ సమావేశంలో యాభైకి పైగా ఉన్న ఆర్ఎస్ఎస్ అనుభంద విభాగాలకు చెందిన జాతీయ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కూడా పాల్గొంటారని తెలుస్తోంది.. బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డాతో పాటు బీఎల్ సంతోష్, వీహెచ్పీ, ఏబీవీపీ, బీఎంఎస్, కిసాన్ సంఘ్, విద్యా భారతి, సేవిక సమితి లాంటి సంస్థలకు చెందిన అగ్రనేతలు హాజరుకాబోతున్నారు.. ఆయా క్షేత్రాలలో జరుగుతున్న కార్యక్రమాలు… ఎదురవుతున్న అనుభవాలపై చర్చ సాగించనున్నారు. పర్యావరణం, కుటుంబ ప్రభోదన్, సామాజిక పరిస్థితుల వంటి కార్యక్రమాలు సమన్వయంతో నిర్వహించడంపై కూడా చర్చించనున్నారు.
Read Also: ఆ విషయంలో ఏపీయే ముందు..! ఆ తర్వాతే తెలంగాణ, గుజరాత్..
Also Read
అయితే, ఆర్ఎస్ఎస్.. హైదరాబాద్నే ఎందుకు ఎంచుకుంది అనే చర్చ సాగుతోంది.. భారతీయ జనతా పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్న దాని వెనుక ఆర్ఎస్ఎస్ ఉంటుందనేది ఓపెన్ సీక్రెట్.. అయితే, తెలంగాణపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన తరుణంలోనే హైదరాబాద్ వేదికగా ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు నిర్వహిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. అసవరాన్ని బట్టి ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ విభాగాలకు సంబంధించిన కీలక నేతలకు పదోన్నతులతో పాటు బదిలీలు కూడా భారీగా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, హైదరాబాద్ వేదిక సమావేశాలు జరుగుతుండడంతో తెలంగాణలో ఆర్ఎస్ఎస్ అనుభంద విభాగం అయిన బీజేపీలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. గతంలో ఉత్తరప్రదేశ్లో ఇలాంటి సమావేశాలు నిర్వహించిన తర్వాత అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిందని చెబుతుంటారు.. ఈ సారి హైదరాబాద్ దీనికి వేదిక కావడంతో ఆలాంటి వ్యూహరచనతోనే ఇక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారా? అనే చర్చ సాగుతోంది. ఈ సమావేశాలకు తెలంగాణలో బీజేపీ కీలక నేతలు కూడా హాజరుకాబోతున్నట్టుగా తెలుస్తోంది.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు.. ఇలా అంతా వస్తే.. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు.. ఇప్పటికే ఓవైపు పోరాటాలతో టీఆర్ఎస్ ప్రభుతాన్ని ఇరకాటంలో పెడుతోంది బీజేపీ.. ఇక, ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని.. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. మరి.. ఆర్ఎస్ఎస్ సమావేశాలు ఏం చర్చిస్తారు..? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
AshuReddy : నటి అషు రెడ్డిపై నమోదైన చీటింగ్ కేసు వివరాలు..పెద్ద స్కెచ్చే
-
IPL Historic Day: బ్యాట్స్మెన్ల మెరుపులు, భారీ స్కోర్లు, రికార్డు ఛేజింగ్లు.. ఐపీఎల్ చరిత్రలో చారిత్రాత్మక రోజు!
-
Gayapadda Simham: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’లో శ్రీ విష్ణు మేజిక్..
-
New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
-
Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!