హైదరాబాద్లో ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు.. కారణం అదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ వేదిక ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు జరగబోతున్నాయి.. ఇవాళ్టి నుంచి అంటే జనవరి 5 నుండి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ జాతీయ సమావేశాలు జరుగుతోంది.. ఈ సమావేశాలకు ఆర్ఎస్ఎస్ సర్ సంచాలక్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఇక, ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హైదరాబాద్ చేరుకున్నారు.. ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో దేశంలో జరుగుతున్న అనేక ఘటనలపై కీలక చర్చ జరగబోతోంది. ఈ సమావేశంలో యాభైకి పైగా ఉన్న ఆర్ఎస్ఎస్ అనుభంద విభాగాలకు చెందిన జాతీయ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కూడా పాల్గొంటారని తెలుస్తోంది.. బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డాతో పాటు బీఎల్ సంతోష్, వీహెచ్పీ, ఏబీవీపీ, బీఎంఎస్, కిసాన్ సంఘ్, విద్యా భారతి, సేవిక సమితి లాంటి సంస్థలకు చెందిన అగ్రనేతలు హాజరుకాబోతున్నారు.. ఆయా క్షేత్రాలలో జరుగుతున్న కార్యక్రమాలు… ఎదురవుతున్న అనుభవాలపై చర్చ సాగించనున్నారు. పర్యావరణం, కుటుంబ ప్రభోదన్, సామాజిక పరిస్థితుల వంటి కార్యక్రమాలు సమన్వయంతో నిర్వహించడంపై కూడా చర్చించనున్నారు.
Read Also: ఆ విషయంలో ఏపీయే ముందు..! ఆ తర్వాతే తెలంగాణ, గుజరాత్..
Also Read
- Putin: పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం.. నిఘా వ్యవస్థలపై తాత్కాలికంగా..!
- Iran-US War: 100 రోజులు పూర్తి చేసుకున్న యుద్ధం.. హార్ముజ్ తెరుచుకోకపోతే తీవ్ర సంక్షోభమే!
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
అయితే, ఆర్ఎస్ఎస్.. హైదరాబాద్నే ఎందుకు ఎంచుకుంది అనే చర్చ సాగుతోంది.. భారతీయ జనతా పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్న దాని వెనుక ఆర్ఎస్ఎస్ ఉంటుందనేది ఓపెన్ సీక్రెట్.. అయితే, తెలంగాణపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన తరుణంలోనే హైదరాబాద్ వేదికగా ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు నిర్వహిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. అసవరాన్ని బట్టి ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ విభాగాలకు సంబంధించిన కీలక నేతలకు పదోన్నతులతో పాటు బదిలీలు కూడా భారీగా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, హైదరాబాద్ వేదిక సమావేశాలు జరుగుతుండడంతో తెలంగాణలో ఆర్ఎస్ఎస్ అనుభంద విభాగం అయిన బీజేపీలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. గతంలో ఉత్తరప్రదేశ్లో ఇలాంటి సమావేశాలు నిర్వహించిన తర్వాత అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిందని చెబుతుంటారు.. ఈ సారి హైదరాబాద్ దీనికి వేదిక కావడంతో ఆలాంటి వ్యూహరచనతోనే ఇక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారా? అనే చర్చ సాగుతోంది. ఈ సమావేశాలకు తెలంగాణలో బీజేపీ కీలక నేతలు కూడా హాజరుకాబోతున్నట్టుగా తెలుస్తోంది.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు.. ఇలా అంతా వస్తే.. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు.. ఇప్పటికే ఓవైపు పోరాటాలతో టీఆర్ఎస్ ప్రభుతాన్ని ఇరకాటంలో పెడుతోంది బీజేపీ.. ఇక, ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని.. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. మరి.. ఆర్ఎస్ఎస్ సమావేశాలు ఏం చర్చిస్తారు..? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Thaman: దాని గురించి నేను కూడా ఆలోచించాలి: తమన్
-
Trinamool Congress: బీజేపీకి టీఎంసీ ఎంపీల మద్దతు.. మమత ఖేల్ ఖతం..
-
IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
-
Lakshadweep: లక్షద్వీప్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
-
Iran Vs Israel: యుద్ధం మళ్లీ మొదలు..! ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల వెనుక ఉన్న కారణాలేంటి?
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!