Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Revanth Reddy Shocking Comments On Ap Cm Chandrababu Over Banakacherla Project

CM Revanth Reddy: ఆంధ్రప్రదేశ్తోనే అసలు సమస్య.. మా హక్కులను మాత్రం వదులుకోం!

Published Date :June 20, 2025 , 6:12 pm
By Chandra Shekhar Pamena
  • రాష్ట్ర కేబినెట్ లో బనకచర్ల అంశంపై చర్చిస్తాం..
  • అవసరమైతే ఏపీతో చర్చలకు మేమే ఒకడుకు ముందుకేస్తాం..
  • ఏపీతో మేమూ వివాదాలు కోరుకోవడం లేదు..
  • ఎవరి కోసమో మా హక్కులను మేం వదులుకోం: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: ఆంధ్రప్రదేశ్తోనే అసలు సమస్య.. మా హక్కులను మాత్రం వదులుకోం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Revanth Reddy: రెండు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ లో బనకచర్ల ప్రాజెక్టుతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేసీఆర్, కిషన్ రెడ్డిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తే.. మొదట తెలంగాణకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కానీ, ప్రాజెక్టుల అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్తుంది.. కేంద్రం సైతం ఆంధ్రప్రదేశ్ నిర్మించనున్న ప్రాజెక్టులపై సమావేశాలు నిర్వహిస్తుంది.. దాంతో తెలంగాణ ఆందోళన పడాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. అయితే, ఆంధ్రప్రదేశ్ తో వివాదాలు కోరుకోవడం లేదు.. అదే సమయంలో ఎవరి కోసమో మా హక్కులను వదులుకోమని తేల్చి చెప్పారు. చర్చల ద్వారానే పరిష్కారమని తెలంగాణ విశ్వసిస్తుంది.. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు రావొద్దనే.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Dhanush : థియేటర్ లో ఏడ్చేసిన ధనుష్..

ఇక, బనకచర్ల ప్రాజెక్టు ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్రానికి ఇవ్వడంతో.. ఆంధ్రప్రదేశ్ తో అసలు సమస్య మొదలైందని సీఎం రేవంత్ అన్నారు. మొదట తెలంగాణకు రిపోర్ట్ ఇచ్చి ఉంటే గొడవ వచ్చేది కాదు అని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య విభేదాల పరిష్కారం కోసం మేము సిద్ధంగా ఉన్నాం.. అనవసర రాద్ధాంతం చేయాలని ఆలోచన మాకు లేదన్నారు. అన్ని రాష్ట్రాలతో సత్సంబంధాలను కోరుకుంటున్నాం.. మాకు ఎగువ దిగువ రాష్ట్రాలు ఉన్నాయి.. పై రాష్ట్రాలతో సమస్య ఉంటే ఆంధ్రప్రదేశ్ తో కలిసి మాట్లాడాల్సిన అవసరం కూడా ఏర్పడుతుందని చెప్పారు. ఇక, బనకచర్ల ప్రాజెక్టుకు పునాది పడింది కేసీఆర్ హయాంలో.. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సెంటిమెంటును అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ ఇంతకాలం బ్రతికింది.. ఇప్పుడు టిఆర్ఎస్ రాజకీయంగా చచ్చిపోయింది అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు జలాలను ఆధారంగా చేసుకుని పునర్జీవనం కోసం ఆ పార్టీ ప్రయత్నం చేస్తుందిని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Read Also: IND vs ENG: లీడ్స్‌లో భారత్‌కు శుభారంభం.. తేలిపోయిన సాయి సుదర్శన్..!

అయితే, పొడుగ్గా పెరిగినంత మాత్రాన తెలివి ఉందనుకోవడం సరైనది కాదు.. హరీష్ రావు అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జ్ఞానానికి పొడవు ఆధారం కాదు.. 2016లోనే బనకచర్ల ప్రాజెక్టు కోసం పునాదిరాయి పడిందన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి.. ఆ ప్రాజెక్టులకు నీళ్లు ఉపయోగించిన తర్వాత మిగిలిన నీళ్లు వరద నీళ్లు అనేది తేలుతుంది.. కాబట్టి, కూర్చుని చర్చిస్తే ఎవరి గ్రీవెన్స్ ఏంటి అనేది తెలుస్తుంది.. తెలంగాణ సమస్య పరిష్కరించుకోవడానికే నా ప్రయత్నం.. కేంద్రంపై కానీ, ఏపీ ప్రభుత్వం కానీ ఎటువంటి కామెంట్స్ చేయను.. డిస్కషన్ కోరుకుంటున్నాం, లిటిగేషన్స్ అవసరం లేదని పేర్కొన్నారు. ఒక్కరోజు కాదు నాలుగు రోజులైనా సరే కూర్చొని మాట్లాడుకొని న్యాయపరంగా, సాంకేతికపరంగా పరిష్కరించుకోవాలని వెల్లడించారు. నేరుగా కేంద్రం వద్దకు ఆంధ్రప్రదేశ్ సీఎం వెళ్తున్నారు.. ఆ ప్రాజెక్టుల అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.. కేంద్ర మంత్రులు సైతం మీటింగులు పెట్టి అనుమతులపై చర్చిస్తున్నారు.. అభివృద్ధి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రులని కలుస్తున్నాం.. వాటి విషయంలో ఎటువంటి డెడ్ లైన్ పెట్టేది లేదు.. అధికారం పోయి అసహనంతో హరీష్ రావు మాట్లాడుతున్నారు అని సీఎం రేవంత్ తెలిపారు.

Read Also: IND vs ENG: లీడ్స్‌లో భారత్‌కు శుభారంభం.. తేలిపోయిన సాయి సుదర్శన్..!

కాగా, కేసీఆర్, హరీష్ రావులు అడ్డగోలు తప్పులు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వాళ్ళ అబద్ధాలకు దేవుడు కూడా ఆశ్చర్యపోతున్నాడు.. బీజేపీ గెలిచేందుకు తెలంగాణలో టీఆర్ఎస్ ఆర్గాన్ డొనేషన్ చేసింది.. దాంతో కమలం పార్టీ 8 సీట్లలో విజయం సాధించిందన్నారు. ఇక, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆల్ పార్టీ మీటింగ్ కు రాలేదు.. ఢిల్లీలో వేరే పనులు ఉన్నాయని చెప్పారు.. కానీ, మేము కలవాలనుకున్న కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, మనోహర్ లాల్ ఖట్టర్లను ఆయన ముందు రోజు కలిశారు.. కిషన్ రెడ్డికి ట్యూటర్ కేటీఆర్.. కేటీఆర్ ను తెలంగాణలో ట్విట్టర్ టిల్లు అని పిలుస్తామని సెటైర్లు వేశారు. ఇక, ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్ పై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Banakacherla Project
  • bjp
  • BRS
  • cm chandrababu

తాజావార్తలు

  • Chhattisgarh Drug Bust: సినిమా ఫక్కీలో నల్లమందు సాగు.. పొలానికి సెక్యూరిటీగా బౌన్సర్లు!

  • T20 World Cup 2026: టీమిండియా ఆటతీరుకు ఫిదా.. మెన్ ఇన్ బ్లూకు ఫ్యాన్‌గా మారిపోయిన పాక్‌ మాజీ కెప్టెన్..

  • Gas Cylinder : వినియోగదారులకు అలర్ట్.. గ్యాస్ కొరతపై ప్రభుత్వం స్పష్టత

  • Compensation: వడదెబ్బ మృతులకు రూ.4 లక్షల పరిహారం.. ఎలా పొందాలంటే..

  • Kavitha : ఇళ్లను కూల్చివేసిన నాయకులకు ఆడ బిడ్డల ఉసురు తగులుతుంది

ట్రెండింగ్‌

  • Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!

  • 8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ తో వచ్చేస్తున్న OPPO Find N6..!

  • Stock Market: ఇన్వెస్టర్ల 14 లక్షల కోట్ల సంపద ఆవిరి.. మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే.!

  • వేసవి వేడికి చవకైన పరిష్కారం.. భారీ డిస్కౌంట్ తో Bajaj PX 97 టార్క్ అందుబాటులో.! ప్రత్యేకతలు, ధర ఇలా..

  • Sesame Laddu: రక్తహీనతకు సొల్యూషన్.., ఆడవారు దృఢంగా ఉండాలంటే.. రోజుకో ‘నువ్వుల లడ్డూ’.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions