Revanth Reddy: బీజేపీ, టీఆర్ఎస్.. విక్రమార్కుడులో రవితేజ, బ్రహ్మానందం లెక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy Satires On BJP TRS Parties: బీజేపీ, టీఆర్ఎస్లది మిత్రబేధమని.. విక్రమార్కుడులో రవితేజ, బ్రహ్మానందం పాత్రల లెక్క ఆ పార్టీల మధ్య బంధం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందరికీ గుండు కొట్టి పంపకాల పంచాయతీ పెట్టినట్టు.. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పంచాయతీ చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. అసలు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎవరో ఇస్తే.. దానిపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు లొల్లి చేయడం ఏందని ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతున్నాయని ఆరోపణలు చేశారు.
ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో తాము గెలిచామని టీఆర్ఎస్ సంబరాలు చేసుకుంటోందని, కానీ స్వతహాగా తాము గెలవలేదని పరోక్షంగా ఒప్పుకున్నారని.. కమ్యూనిస్టుల శరణుతో గెలిచారని రేవంత్ రెడ్డి చురకలంటించారు. ఒకప్పుడు కమ్యూనిస్టులు లేరని చెప్పిన సీఎం కేసీఆర్కు ఇప్పుడు వాళ్లే దిక్కు అయ్యారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇప్పుడు పరాన్నజీవి అయ్యారని కౌంటర్ వేశారు. ఇక బీజేపీ బరితెగించిందని, నడి బజారులో నగ్నంగా నిలబడిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మద్యంతో పాటు వందల కోట్లు డబ్బులు పంచి.. మునుగోడుని మద్యం అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలబెట్టిందన్నారు. టీఆర్ఎస్ కూడా తక్కువేం కాదని.. ఆ రెండు పార్టీలు కలిసి రూ. 300 కోట్ల మద్యం తాగించారని ఆరోపణలు చేశారు. అయితే.. ఈ పాపంలో తమ పాత్ర లేదని తెలిపారు.
Also Read
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
ఎన్నికల సంఘంతో ఎలాంటి ఉపయోగం లేదని మునుగోడు ఎన్నికలు నిరూపించాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. మాయా పాచికలో పాండవులు ఓడిపోయినప్పుడు కౌరవులు సంతోషించారు.. కానీ కురుక్షేత్రంలో పాండవులే గెలిచారని గుర్తు చేశారు. మునుగోడు ఎన్నికలతో టీఆర్ఎస్, బీజేపీ ఓటమికి పునాది పడిందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్కు ఓట్లు రాలేదని నిరాశలో ఉన్నానన్న ఆయన.. కార్యకర్తలు పార్టీకి అండగా నిలబడ్డారని, కాంగ్రెస్ శ్రేణుల కృషి అభినందనీయమని కొనియాడారు. తమ పోరాట పటిమలో లోపం లేదని చెప్పారు. ఇదే సమయంలో గవర్నర్ vs ప్రభుత్వం వివాదంపై మాట్లాడుతూ.. గవర్నర్ కూడా ప్రతిదీ రాజకీయ కోణంలో చూడొద్దని, బీజేపీ నాయకుల బాధ్యత నిర్వహించాలనుకోవడం సమంజసం కాదని హితవు పలికారు.
ఇక రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ ప్రజలకు విశ్వాసం కలిగించిందని.. ఉదయించే సూర్యుడిలాగా రాహుల్ గాంధీ తెలంగాణలోకి ఎంటరయ్యారని రేవంత్ రెడ్డి తెలిపారు. చరిత్రాత్మకమైన హైదరాబాద్ నగరం ఆయనకు ఘనంగా స్వాగతం పలికిందన్నారు. అపనమ్మకంతో ఉన్న సమాజానికి రాహుల్ భరోసా కల్పించారన్నారు. జోడో యాత్రలో తన బాధ్యతను సంపూర్ణంగా నిర్వహించానని అనుకుంటున్నానని.. జోడో యాత్ర స్పూర్తితో జనంలోకి వెళతామని.. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!