Revanth Reddy: బండి సంజయ్, కేఏ పాల్ మాటలకి పెద్ద తేడా ఉండదు.. రేవంత్ సెటైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy Satires On Bandi Sanjay: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు, కేఏ పాల్ మాటలకు పెద్ద తేడా ఉండదని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ నిరాశలో ఉన్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోజులో తమ దగ్గరున్న వాళ్లను బండి సంజయ్ ఎత్తుకుపోయాడని, ఇప్పుడు ఏమైందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా.. కాంగ్రెస్ని గెలిపించమని బండి సంజయ్ అన్నారని గుర్తు చేశారు. బండి సంజయ్ మాటలను సీరియస్గా కాకుండా, సానుభూతితో చూడాలని సూచించారు. బండి సంజయ్ పట్ల సానుభూతి తప్ప.. వేరే విషయం ఉండదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని.. కాంగ్రెస్కు ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినట్టేనని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు గాను.. రేవంత్ రెడ్డి ఈ విధంగా కౌంటర్లు ఇచ్చారు.
Mahi V Raghav: డిస్నీ+ హాట్స్టార్ పరువు తీశారంటే.. ‘పంది’తో గొడవ పడలేనంటున్న డైరెక్టర్!
Also Read
- CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
- KTR: '8+8 = 0'.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
- Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
ఇదే సమయంలో.. తెలంగాణ ప్రభుత్వంపై కూడా రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలో భూముల ధరలు పెరగడానికి ప్రభుత్వమే కారణమైతే.. రైతుల భూములకు ఎందుకంత ధర చెల్లించడం లేదని ప్రశ్నించారు. రేపు తానే తెలంగాణను అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్తే.. కేసీఆర్ దాన్ని కూడా ఆమోదిస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్కి ఏది నచ్చితే అది అన్వయించుకోవడం.. రాజకీయ వ్యభిచార లక్షణమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరవీరుల స్థూపం నిర్మాణంలో చాలా అవినీతి జరిగిందని ఆరోపించారు. అమరవీరుల పేర్లు లేకుండా అమరస్థూపం ఏంటని ప్రశ్నించారు. పవిత్రమైన అమరుల స్మారకాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చి అపవిత్రం చేశారని వ్యాఖ్యానించారు. ఏడాదిలోనే ప్రగతి భవన్ కట్టగలిగినప్పుడు.. అమరవీరుల స్థూపం కట్టేందుకు 9 సంవత్సరాలు ఎందుకు పట్టిందని నిలదీశారు. సచివాలయ నిర్మాణంలోనూ అవినీతి జరిగిందన్న ఆయన.. వీటిపై విజిలెన్స్ విచారణ జరిపి, అందరినీ జైలుకు పంపుతామన్నారు.
Bihar: పట్టపగలే బీహార్లో కాల్పులు.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
తాజావార్తలు
-
CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
-
Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
-
KTR: ‘8+8 = 0’.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
-
2027 ODI World Cup: ప్రపంచ కప్కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్కు బిగ్ షాక్!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!