Revanth reddy: కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పాదయాత్ర.. నేడు కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో..
Revanth reddy: తెలంగాణా రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చెయ్యటానికి కాంగ్రెస్ పార్టీ సరికొత్త కార్యక్రమంలో ముందుకు పోతుంది. ఈనేపథ్యంలో.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర 25వరోజుకు చేరింది. ఈరోజు కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో యాత్ర ఫర్ చేంజ్ పాదయాత్ర కొనసాగనుంది. ఉదయం 9 గంటలకు ముత్యంపేటలోని షుగర్ ఫ్యాక్టరీ సందర్శించనున్నారు రేవంత్. ఉదయం 11:30 గంటలకు మెట్ పల్లి పసుపు మార్కెట్ సందర్శిస్తారు. మధ్యాహ్నం 1:00 గంటలకు ముత్యంపేట యాత్ర క్యాంపులో భోజన విరామం అనంతరం సాయంత్రం 4:00 గంటలకు ధర్మారంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఐలాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పరిశీలించనున్నారు రేవంత్ రెడ్డి . అనంతరం ఐలాపూర్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఐలాపూర్ నుంచి కిషన్ రావుపల్లి మీదుగా యాత్ర కోరుట్ల చేరుకోనుంది. ఇక రాత్రి 7 గంటలకు కోరుట్ల అంబేద్కర్ సర్కిల్ లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో రేవంత్ మాట్లాడనున్నారు. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని కమ్మర్ పల్లిలో రాత్రి బస చేయనున్నారు రేవంత్ రెడ్డి.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ సమస్యల నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ధరణి అదాలత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్తో ప్రాణాలు కోల్పోయిన సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన 32 మందికి కాంగ్రెస్ నాయకులు హామీ కార్డులను అందజేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 100 రోజుల్లో వారి సమస్యలు పరిష్కరించి వారి భూములు వారికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని నాయకులు బాధితులకు హామీ ఇచ్చారు.
Father Gets Daughter Pregnant: కూతురిని గర్భవతిని చేసిన తండ్రి.. కోర్టు సంచలన శిక్ష
Also Read
తాజావార్తలు
-
Green Moong Dal Laddu: ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు బెల్లం లడ్డు.. పిల్లల కోసం అదిరిపోయే హెల్దీ స్నాక్.!
-
CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
-
Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
-
Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు
-
FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!