CM Revanth Reddy : కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన వారితో కమిటీ వేసి.. ఆ చట్టం రాయిస్తాం
- మేము ఉద్యోగాలు ఇస్తుంటే రూ.2 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు
- అది విని నాకు చాలా ఆవేదన కలిగింది
- చిక్కుముడులను విప్పి గ్రూప్-1 సమస్యను పరిష్కరించాం
- దేశంలో ఎక్కడా జరగని విధంగా కుల సర్వే చేశాం
- దేశంలో జరిగే జనగణనలో కులగణన లెక్కలు తప్పకుండా చేర్చే పరిస్థితి తెచ్చాం
- నాకంటూ ప్రత్యేకమైన సైన్యం, వ్యవస్థ లేదు.. మీరే నా సైనికులు. - సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : హైదరాబాద్లో శిల్పకళావేదికలో జరిగిన గ్రూప్-2 నియామక పత్రాల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి 783 మంది ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సచివాలయ అధికారులు రామకృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “నిస్సహాయకులకు సహాయం చేయడం మన బాధ్యత. తల్లిదండ్రులను, పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవడం ప్రతి ఉద్యోగార్థి బాధ్యత. మీరంతా దీని కోసం అంకితమవుతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఉద్యోగార్థులు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే, వారి జీతంలో 10 నుంచి 15 శాతం కోత విధించి, అదే మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాలో ఉంచతాము. జీతం వచ్చే అదే రోజున తల్లిదండ్రుల ఖాతాలోనూ ఈ సొమ్ము జమ అవుతుంది. దీని కోసం త్వరలో చట్టం తీసుకువస్తాం.”
Also Read
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
Google: గూగుల్ దీపావళి ఆఫర్.. కేవలం రూ. 11కే ప్రీమియం సర్వీస్..
అంతేకాకుండా.. “శ్రీకాంతాచారి, వేణుగోపాల్రెడ్డి, ఈషాన్రెడ్డి, యాదయ్య వంటి యువ విద్యార్థులు తమ త్యాగంతో తెలంగాణ ఉద్యమాన్ని సాధించారు. కానీ, ఆ తర్వాత రాజకీయ నేతలు నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించడంతో నిరుద్యోగ సమస్యలను పట్టించుకోలేదు. వారి కుటుంబాలకే ప్రాధాన్యం ఇచ్చి ప్రజల అవసరాలను పక్కన పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మూడు సంవత్సరాల్లో కూలడం, ప్రభుత్వ పాఠశాలల విద్యను ఉపయోగించకపోవడం, రైతులకు ఆర్ధిక జ్ఞానం అందించకపోవడం ఈ వ్యవస్థలో లోపాలను చూపుతుంది,” అని గుర్తు చేశారు.
“పేదింటి బిడ్డలు రూ.3 కోట్లు ఇచ్చి ఉద్యోగం కొనగలరా? ఇలాంటి ఆరోపణలు అవమానకరంగా ఉన్నాయి. కష్టపడి చదివిన యువతే ఉద్యోగాలు పొందాలి. రాజకీయ విమర్శలపై ఆవేదన కలిగింది, కానీ నిజానికి యువతకు అవకాశాలు ఇచ్చే చర్యలు కొనసాగుతున్నాయి. గతంలో జరగని కుల గణన కూడా కాంగ్రెస్ పోరాటం వల్ల త్వరలో సాధ్యమవుతుంది,” అని రేవంత్ అన్నారు.
Google: గూగుల్ దీపావళి ఆఫర్.. కేవలం రూ. 11కే ప్రీమియం సర్వీస్..
తాజావార్తలు
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Jana Nayagan Box Office : తెలుగులో తగ్గిపోయిన ఓపెనింగ్స్.. రీమేక్ ఎఫెక్టేనా?
-
Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
-
Samsung Galaxy Z Fold 8: 50MP కెమెరా, 4800mAh బ్యాటరీతో.. సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 విడుదల
-
Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!