Revanth Reddy: 31న సిలిండర్లకు దండలేసి డప్పు చాటింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనాతో కూలీలు ఉపాధి కోల్పోయారు. పేదలకు సాయం అందించడం మానేసి జేబు దొంగల మాదిరిగా దోచుకుంటున్నారని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వాలు..పెట్రో ధరలు విపరీతంగా పెంచుతుంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఒకరి తప్పు..ఇంకొకరు కప్పి పుచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడ బలుక్కొని పేదల్ని దోచుకుంటున్నాయి.
విద్యుత్ చార్జీలు పెంచడంతో 5 వేల కోట్లు.. సర్ చార్జి పేరుతో మరో అరు వేల కోట్లు దోచుకుంటున్నదన్నారు రేవంత్. ఈఆర్సీ ముందు నా వాదన వినిపించిన పెడ చెవిన పెట్టింది. విద్యుత్ సంస్థలు ఆర్దికంగా దెబ్బతిన దానికి ప్రభుత్వ విధానమే కారణం. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటూనే విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వక పోవడంతో 12,500 కోట్లు బకాయి పడ్డాయన్నారు.
Also Read
- Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
ప్రభుత్వ పెద్దలు కొందరు బిల్లులు ఎగవేతతో 6 వేల కోట్లు నష్టం వచ్చిందన్నారు. ప్రభుత్వం సబ్సిడీ లు చెల్లిస్తే విద్యుత్ సంస్థలు లాభాల్లో ఉంటాయి. కానీ ప్రజలకు ఉచితం ఇస్తున్నాం అంటూనే మరో వైపు ప్రజల నుండి ముక్కు పీల్చి విద్యుత్ ఛార్జీలు పెంచి వసూలు చేస్తుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో పెట్రో .డీజిల్ ధరలు పెరగలేదు. కానీ ఎన్నికలు అయిపోగానే… గ్యాస్..డీజిల్ ధరలు పెంచింది.
జీడీపీ పెంచుతాం అని మోడీ సర్కారు గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచింది. కేసీఆర్ విద్యుత్.. మోడీ గ్యాస్ ధరలు పోటా పోటీగా పెంచుతున్నారు. ఇద్దరు కలిసి దోపిడీ చేస్తూ… ఇద్దరూ ధర్నాలు చేస్తున్నారు. ప్రజలను దోచుకుంటుటున్న ఇద్దరూ… నాటకాలు ఆడుతున్నారు. బీజేపీ…టీఆర్ఎస్ సమన్వయంతో దోపిడీ జరుగుతోందన్నారు రేవంత్.
పెంచిన సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మార్చి 31 న సిలిండర్లకు దండలు వేసి .. డప్పు చాటింపు వేస్తాం అన్నారు. విద్యుత్ చార్జీల పెంపు నిరసిస్తూ మండల కేంద్రంలో ఏఈ, డీఈ కార్యాలయాల ముందు ఆందోళనలు నిర్వహిస్తాం అన్నారు. ఏప్రిల్ 4 న మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు జరుపుతామన్నారు.
అంబేద్కర్ విగ్రహం ముందు కేసీఆర్..మోడీ దిష్టి బొమ్మ దగ్దం చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఏప్రిల్ 5 న కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన తెలుపతామన్నారు. ఏప్రిల్ 7న హైదరాబాద్ లో విద్యుత్ సౌద ముట్టడి వుంటుందన్నారు. వరి కొనక పోతే..ఇద్దరినీ ఉరి వేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇద్దరు కలిసి రాజకీయ ప్రయోజనం కోసం రైతులను చంపుతున్నారు. ఇద్దరూ వ్యూహాత్మకంగా రాజకీయ దురాశతో ఉన్నారని రేవంత్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Budhaditya Rajyog 2026: మిథునంలో సూర్యుడు.. 5 రాశుల వారికి రాజయోగాల జాక్పాట్.!
-
Dhanush – Siruthai Siva: “ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు”.. ఆ తెలుగు డైరెక్టర్కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
-
POK Protest: అసిమ్ మునీర్ ఒక టెర్రరిస్ట్.. పీఓకేలో తిరుగుబాటు..
-
Spicy Idli Chaat Recipe: మిగిలిన ఇడ్లీలతో సూపర్ స్పైసీ చాట్.. 5 నిమిషాల్లో రెడీ..!
-
Akash Goparaju: కోనసీమ బ్యాక్డ్రాప్లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!