Revanth Reddy: 31న సిలిండర్లకు దండలేసి డప్పు చాటింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనాతో కూలీలు ఉపాధి కోల్పోయారు. పేదలకు సాయం అందించడం మానేసి జేబు దొంగల మాదిరిగా దోచుకుంటున్నారని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వాలు..పెట్రో ధరలు విపరీతంగా పెంచుతుంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఒకరి తప్పు..ఇంకొకరు కప్పి పుచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడ బలుక్కొని పేదల్ని దోచుకుంటున్నాయి.
విద్యుత్ చార్జీలు పెంచడంతో 5 వేల కోట్లు.. సర్ చార్జి పేరుతో మరో అరు వేల కోట్లు దోచుకుంటున్నదన్నారు రేవంత్. ఈఆర్సీ ముందు నా వాదన వినిపించిన పెడ చెవిన పెట్టింది. విద్యుత్ సంస్థలు ఆర్దికంగా దెబ్బతిన దానికి ప్రభుత్వ విధానమే కారణం. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటూనే విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వక పోవడంతో 12,500 కోట్లు బకాయి పడ్డాయన్నారు.
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ప్రభుత్వ పెద్దలు కొందరు బిల్లులు ఎగవేతతో 6 వేల కోట్లు నష్టం వచ్చిందన్నారు. ప్రభుత్వం సబ్సిడీ లు చెల్లిస్తే విద్యుత్ సంస్థలు లాభాల్లో ఉంటాయి. కానీ ప్రజలకు ఉచితం ఇస్తున్నాం అంటూనే మరో వైపు ప్రజల నుండి ముక్కు పీల్చి విద్యుత్ ఛార్జీలు పెంచి వసూలు చేస్తుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో పెట్రో .డీజిల్ ధరలు పెరగలేదు. కానీ ఎన్నికలు అయిపోగానే… గ్యాస్..డీజిల్ ధరలు పెంచింది.
జీడీపీ పెంచుతాం అని మోడీ సర్కారు గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచింది. కేసీఆర్ విద్యుత్.. మోడీ గ్యాస్ ధరలు పోటా పోటీగా పెంచుతున్నారు. ఇద్దరు కలిసి దోపిడీ చేస్తూ… ఇద్దరూ ధర్నాలు చేస్తున్నారు. ప్రజలను దోచుకుంటుటున్న ఇద్దరూ… నాటకాలు ఆడుతున్నారు. బీజేపీ…టీఆర్ఎస్ సమన్వయంతో దోపిడీ జరుగుతోందన్నారు రేవంత్.
పెంచిన సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మార్చి 31 న సిలిండర్లకు దండలు వేసి .. డప్పు చాటింపు వేస్తాం అన్నారు. విద్యుత్ చార్జీల పెంపు నిరసిస్తూ మండల కేంద్రంలో ఏఈ, డీఈ కార్యాలయాల ముందు ఆందోళనలు నిర్వహిస్తాం అన్నారు. ఏప్రిల్ 4 న మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు జరుపుతామన్నారు.
అంబేద్కర్ విగ్రహం ముందు కేసీఆర్..మోడీ దిష్టి బొమ్మ దగ్దం చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఏప్రిల్ 5 న కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన తెలుపతామన్నారు. ఏప్రిల్ 7న హైదరాబాద్ లో విద్యుత్ సౌద ముట్టడి వుంటుందన్నారు. వరి కొనక పోతే..ఇద్దరినీ ఉరి వేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇద్దరు కలిసి రాజకీయ ప్రయోజనం కోసం రైతులను చంపుతున్నారు. ఇద్దరూ వ్యూహాత్మకంగా రాజకీయ దురాశతో ఉన్నారని రేవంత్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
-
Jani Master: ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. జానీ మాస్టర్కు ఊహించని షాక్!
-
Hombale Films: ‘కేజీఎఫ్’ నుంచి ‘మహా అవతార్’ వరకు.. హోంబలే ఫిల్మ్స్ భారీ ప్లాన్తో ఇండియన్ సినిమాకు కొత్త దిశ
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!