Revanth Reddy: బంగారు తెలంగాణ కాదు బందీ తెలంగాణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా పరిగిలో మన ఊరు-మన పోరులో పాల్గొన్నారు. తెలంగాణలో 8 ఏళ్ళుగా పాలిస్తున్న కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తున్నామని చెప్పి కబంధ హస్తలలో బంధించారన్నారు. రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో కొండా రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, మానిక్ రావ్, దేవేందర్ గౌడ్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. పరిగి ఎమ్మెల్యే దేవుడు మాన్యాలను మింగాడన్నారు. చేవెళ్లను కొండ పోచమ్మ లో ముంచిండు, చెల్లమ్మను టీఆర్ఎస్ లో కలుపుకున్నాడు.
అభివృద్ధి కోసం టిఆర్ఎస్ లో కలిసామని అన్న చేవెళ్ల చెల్లమ్మ ఎందుకు చేవెళ్ల అభివృద్ధి కోసం అడగడం లేదు. ఈ ప్రాంతానికి రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల తెచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి జిఓ ఇచ్చారు. ప్రాణహిత ప్రాజెక్టు ను చేవెళ్లను రాకుండా అడ్డుకున్నది కేసీఆర్ కాదా? యాదగిరి గుట్ట లో ప్రమాణం చేసి చెవుతావా కేసీఆర్. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లను ఏ దేవుడు పాలిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఏ దయ్యం పాలిస్తుంది. పాలమూరు రంగారెడ్డిని కట్టమని కేసీఆర్ కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. కేసీఆర్ -జగన్ ప్రగతి భవన్ లో అలయ్ బలయ్ చేసుకొని మనల్ని నిండా ముంచిండ్రు. మూడేళ్ళ కిందనే పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఉంటే ఇవాళ ఇలా మా గొంతులు ఎండేవా? ఆంధ్ర వాళ్ళు నీళ్లు, నిధులు దోచుకుపోతున్నారని కేసీఆర్ అన్నారు.తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు నీళ్లు వస్తాయన్నారు.
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్హౌస్లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
- Bhatti Vikramarka : నేలను కాదు.. బుద్ధిని శుద్ధి చేసుకోండి’
- TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
- Uday Krishna Reddy : ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్.. పొటెన్సీ టెస్ట్పై కీలక ఆదేశాలు.!

సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చాక ఇప్పుడు నీళ్లు జగన్ దోచుకుపోయాడు. నియామకాలు కేసీఆర్ ఇంట్లో అయ్యాయి. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు.. ఇప్పుడు దేశానికి ప్రధాని చేయమంటున్నాడు. ఇక దేవుణ్ణి చేస్తే అన్ని పనులు చేస్తారు అనే పరిస్థితి ఉంది. కేసీఆర్ తాగుబోతు మాటలు నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఆర్టీసీ, విద్యుత్, మహిళలు, టీచర్లు, కలెక్టర్ల అవినీతి, నిరుద్యోగులు, రైతులు, ఇలా ప్రతి ఒక్కరు వాళ్ల గురించి మాట్లాడుతున్నారు. రైతుల ధాన్యం కొనమని అంటున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో 150 ఎకరాలలో వేసిన వరి కొనేవాడు మన రైతుల వడ్లు కొనాలి. కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎవరు కొంటే వాళ్లే కొనాలి. కేసీఆర్ వడ్లు కొనకపోతే కేసీఆర్ ను అమరవీరుల స్థూపం వద్ద ఉరి వేద్దాం అన్నారు రేవంత్ రెడ్డి.
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
-
CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్హౌస్లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!