Revanth Reddy: కేసీఆర్ అన్ని నాశనం చేశారు.. ఆయన్ను అరెస్ట్ చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy Demands Police To Arrest KCR: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా సీఎం కేసీఆర్పై విరుచుకుపడ్డారు. సర్పంచులకు గ్రామాలపై అధికారం అప్పగించింది కాంగ్రెస్ పార్టేనని, కానీ కేసీఆర్ సీఎం అయ్యాక అన్నింటినీ నాశనం చేశారని ఆరోపణలు చేశారు. అధికారాలన్నీ కేసీఆర్ తన చేతుల్లోకి తీసుకున్నారన్నారు. తాను ఉపవాసమైనా ఉంటాను గానీ గ్రామ పంచాయతీల నిధులు ఆపనని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఇప్పుడు సర్పంచుల అధికార బాధ్యతల్ని ఎంపీడీఓలకు అప్పగించారన్నారు. నిధులు దారి మళ్లించారని.. ఇది అన్యాయం, అక్రమమని మండిపడ్డారు. గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు కూడా జీతం ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. కేసీఆర్ సర్పంచుల నిధుల దొంగలించిన ఒక గజ దొంగ అని.. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Perni Nani: తెలంగాణ మంత్రులపై సంచలన వ్యాఖ్యలు.. ఏపీకి ద్రోహం చేశారు
Also Read
సర్పంచులు రాజీనామాలు చేసే పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సర్పంచులకు అండగా ఉండి పోరాటం చేస్తామంటే అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. తానూ ఒక పెద్ద ఉద్యమకారుడినని చెప్పుకునే కేసీఆర్.. ధర్నా చౌక్లో ధర్నా చేస్తామంటే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇందుకు కేసీఆర్కి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. పోలీసులు సైతం దురుసుగా ప్రవరిస్తున్నారని.. అందరినీ తాము గుర్తు పెట్టుకుంటామని హెచ్చరించారు. కేసీఆర్ శాశ్వతంగా ఉంటారని అనుకోవద్దని, ఆయన ఉండేది ఇంకో ఎనిమిది నెలలేనని పోలీసుల్ని సూచించారు. తాము కోర్టుకి వెళ్తామని, కోర్టు అనుమతితో ధర్నా చౌక్లో ధర్నా చేస్తామని తేల్చి చెప్పారు. సర్పంచులంరూ రోడ్డెక్కి.. మంత్రుల చొక్కాలు పట్టుకొని నిలదీయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Elon Musk: మస్త్ సమస్యల్లో మస్క్.. ఆఫీసు అద్దె చెల్లించలేదని కేసు
పోలీసులందరూ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అర్హత లేకున్నా.. అంజనీ కుమార్కు కేసీఆర్ డీజీపీ పదవి ఇచ్చారన్నారు. తమని అరెస్ట్ చేయమని డీజేపీకి కేసీఆర్ న్యూ ఇయర్ నయరాజా ఇచ్చారని ఆరోపణలు చేశారు. డీజీపీ చట్టాన్ని గౌరవించాలే గానీ, కేసీఆర్ని సంతోషపెట్టే పని చేయొద్దని హితవు పలికారు. తన పార్టీ పేరు మార్చుకున్నప్పుడే.. కేసీఆర్కు తెలంగాణతో పేగు బంధం తెగిపోయిందన్నారు. బీఆర్ఎస్ అంటే బిహార్ రాష్ట్ర సమతి అని అభివర్ణించారు. అందుకే కేసీఆర్ బీహార్ వాళ్లనే తెచ్చుకున్నారన్నారు. కేసీఆర్, బీజేపీ ఒకటేనని.. ఇద్దరూ బెంగాల్ తరహా రాజకీయాలకు తెరలేపారన్నారు. కేసీఆర్ నిధులు మళ్లిస్తే.. కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
Crime News : ప్రేమను నిరాకరించిందని అమ్మాయిని కత్తితో పొడిచిన పవన్ కల్యాణ్
అయ్యప్పస్వామిని కించపరిచిన వ్యవహారంలోనూ రాజకీయ కుట్ర ఉందని.. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఈ కుట్ర పన్నాయని రేవంత్ అనుమానం వ్యక్తం చేశారు. డిసెంబర్ 19న అతడు మాట్లాడితే.. ఇంతవరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. వందల కోట్ల కాంట్రాక్టు పనులు ఇచ్చారని.. వీటిపై విచారణ జరపాల్సిందేనని అన్నారు. బీఆర్ఎస్లో చేరిన వాళ్లకు తాడు బొంగరం కూడా లేదని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఉన్నోళ్లకే అపాయింట్మెంట్ లేదని, అలాంటప్పుడు చేరిన వాళ్లకు ప్రాధాన్యత ఏముంటుందని రేవంత్ అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Srisailam Dam: శ్రీశైలం వైపు దూసుకొస్తున్న కృష్ణమ్మ.. వారంలో గేట్లు ఎత్తే అవకాశం.!
-
IPL 2027: CSKకు కోలుకోలేని దెబ్బ.. ఒకేసారి మూడు జట్లకు రాజీనామా.. అతడికే జట్టు బాధ్యతలు..
-
Jantar Mantar Love Story: నిరసన కోసం వస్తే వధువే దొరికింది.. పెళ్లితో ఒక్కటైన విద్యార్థులు
-
Bhogapuram International Airport: భోగాపురం నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాలకు గ్రీన్ సిగ్నల్.. ఎయిర్లైన్స్ షెడ్యూల్ ఖరారు
-
Test Cricket: డబ్ల్యూటీసీ రేసులో అసలైన డ్రామా.. 9 మ్యాచ్లు, 7 గెలుపులు.. టీమిండియా మైండ్ గేమ్ మొదలు..
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!