Revanth Reddy: చాయ్ అమ్ముకునే వ్యక్తిని ప్రధానిని చేస్తే.. దేశయువతకు నజరానా ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాయ్ అమ్ముకునే వ్యక్తి ని ప్రధానిని చేస్తే.. దేశ యువతకు నరేంద్ర మోడీ ఇచ్చే నజరానా ఇదేనా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. చంచల్ గూడ జైల్లో సికింద్రాబాద్ నిందుతులను రేవంత్ రెడ్డి పరామర్శించారు. జైల్లో నిరసనకారులతో ములాకత్ అయి వారికి అండగా ఉంటామని, సికింద్రాబాద్ ఘటన, కేసులకు సంబంధించి న్యాయ సలహాలు ఇస్తామని నిందితులకు హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగాల కోసం ఎంతో మంది యువత ఎదురుచూస్తున్నారని, అగ్నిపథ్ పై ప్రధాని హడావిడి నిర్ణయం తీసుకున్నారని, ఏకపక్ష నిర్ణయంతో యువకుల్లో అయోమయం నెలకొందని విమర్శించారు. కేవలం 4ఏళ్లు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అంటే ఎట్లా అన్న ఆయన..అగ్నిపథ్ 6 నెలల ట్రైనింగ్ లో ఏం నేర్పిస్తారని ప్రశ్నించారు.
రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి భద్రత లేకుండా కుట్ర చేశారని ఆరోపించారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి ఏటా 60 వేల మందిని ఆర్మీలో రిక్రూట్ చేయడం జరుగుతుందన్నారు. కాని మోడీ సర్కార్ రెండేళ్లుగా ఆర్మీ నియామకాలు చేపట్టలేదన్నారు.అగ్నిపథ్ పథకాన్ని హడావుడిగా తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. అత్యంత కీలకమైన అంశంలో పార్లమెంట్ లో చర్చించకుండానే నాలుగు సంవత్సరాలకోసం రిక్రూట్ చేసే విధానం నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఆర్మీ అభ్యర్థులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని, భవిష్యత్ లో ఉధ్యోగాలు రాకుండా నాన్ బెయిల్ కేసులు పెట్టారని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తాము విధ్వంసాలకు పాల్పడలేదని రిమాండ్ లో ఉన్న ఆర్మీ అభ్యర్థులు చెబుతాన్నారని చెప్పారు.
Also Read
- Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
- Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
- PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
ఇంతమంది పై ఇంత గుడ్డిగా 307ఐపీసీ కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. అగ్నిపథ్ ను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. ఆర్మీ అభ్యర్థుల పై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మూడేళ్ల నుండి ఆర్మీలో నియామకాలు చేపట్టలేదని..దీంతో సైనికుల కొరత ఏర్పడిందన్నారు. 2020లో ఫిజికల్ ఎగ్జామ్స్ పాసైన వారికి రాత పరీక్షలు నిర్వహించాలని రేవంత్ డిమాండ్ చేశారు. న్యాయ సలహా కోసం ఇప్పటికే గాంధీభవన్ లో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. ఇక చంచల్ గూడ జైలు బయట నిందితుల కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రేవంత్ రెడ్డితో పాటు అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, అనిల్ యాదవ్, మల్ రెడ్డి రంగారెడ్డి నిందితులను కలిశారు.
Samsung Galaxy M52: అద్భుత ఆఫర్.. ఆ స్మార్ట్ఫోన్పై 30 శాతం ధర తగ్గింపు..
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం