Revanth Reddy: గత చరిత్ర పై చర్చ చేద్దామా..? కేటీఆర్ పై రేవంత్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: గతంలో జరిగిన చరిత్ర పై చర్చ చేద్దామని తెలిపారు. గత చరిత్రలో.. మీ వైపు ఉన్న వాళ్ళ చరిత్ర తీద్దామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సభలో వాడీవేడీ చర్చ సాగుతోంది. ఈరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ మాటల యుద్ధం జరిగింది. దీంతో ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావ్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగి పడవు అంటూ రేవంత్ కౌంటర్ ఇచ్చారు. కొంత మంది ఎన్ఆర్ఐ లకు ప్రజా స్వామ్య స్ఫూర్తి తెలియదన్నారు. 51 శాతం నెంబర్ ఉన్న వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్నారు. సహేతుకంగా విశ్లేషణ చేయాలి ప్రతిపక్షం అన్నారు. అచ్చోసిన ఆంబోతులం ..పోడియం కి వస్తాం అంటే అహం సరికాదంటూ ఫైర్ అయ్యారు. పదే పదే గత పాలన గురించి మట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ యూత్ కాంగ్రెస్ అద్యక్షుడుని చేసింది కాంగ్రెస్ అన్నారు. కేసీఆర్ ని ఎంపీ గా గెలిపించింది కాంగ్రెస్ అన్నారు. కేంద్ర మంత్రి చేసిందే కాంగ్రెస్ అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుడుని ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసింది వైఎస్ అన్నారు.
Read also: Prabhas: మీడియా ముందుకు నీల్ వస్తాడు సరే… మరి ప్రభాస్ పరిస్థితి ఏంటి?
Also Read
పోతిరెడ్డిపాడు పొక్క పెంచునప్పుడు కొట్లాడింది పీజేఆర్ అన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఆరోజు ఎవరు కొట్లాడలేదన్నారు. మా పార్టీ పీజేఆర్ కొట్లాడారని తెలిపారు. ఏ పాలకుల గురించి మాట్లాడుతున్న వాళ్ళు అని, ఎలా ఎమ్మెల్యే అయ్యారన్నారు. సిరిసిల్లలో కేటీఆర్, కేసీఆర్ గురువు దయతో ఎమ్మెల్యే అయ్యాడని అన్నారు. మేనేజ్మెంట్ కోటాలో వచ్చారు కేటీఆర్ ఇక్కడికి అంటూ తెలిపారు. గతం గురించి చర్చ చేద్దాం అంటే..ఒకరోజు సమయం ఇవ్వండన్నారు. సంపూర్ణ చర్చ చేద్దామని తెలిపారు. గతంలో జరిగిన చరిత్ర పై చర్చ చేద్దామని తెలిపారు. గత చరిత్రలో.. మీ వైపు ఉన్న వాళ్ళ చరిత్ర తీద్దామన్నారు. వరంగల్ ఎంకౌంటర్ లకు ఎవరు కారకులు? అని ప్రశ్నించారు. గవర్నర్ కాంగ్రెస్ మేనిఫెస్టో చదివారు అంటున్నారని, మా పాలసీ కి..కేబినెట్ ఆమోదం చేశామన్నారు. తొమ్మిదేళ్ల పాలనపై ఎక్స్ ర్ తీసినట్టు అన్ని బయట పెడతామన్నారు. పిల్లి శాపనర్దాలకు ఉట్లు తెగి పడవంటూ సెటైర్ వేశారు. ఏమి బయపడం.. సలహాలు ఇవ్వండి వింటాం అన్నారు. ప్రతిపక్ష పార్టీలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ అన్నారు.
Purandeswari: పోలవరం ప్రాజెక్టును డబ్బు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి..
తాజావార్తలు
-
RAPO23 : హీరో కమ్ దర్శకుడిగా రామ్ పోతినేని.. పూజ కార్యక్రమానికి టైమ్ ఫిక్స్
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
-
Balan The Boy: 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు.. మరో బ్లాక్ బస్టర్తో చిదంబరం మ్యాజిక్
-
Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
-
Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!