Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ బస్ట్
- 110 కిలోల గంజాయి, రెండు కార్లు స్వాధీనం
- నకిలీ నెంబర్ ప్లేట్లు, ఇంటర్నెట్ కాలింగ్తో స్మగ్లింగ్
- ప్రధాన సూత్రధారి కోసం పోలీసుల గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganja Smuggling : హైదరాబాద్ శివార్లలో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఒక ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శంషాబాద్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ , ఆదిబట్ల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్లో సుమారు 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ డీసీపీ రాజేష్ మీడియాకు వెల్లడించారు. సీజ్ చేసిన గంజాయి విలువ మార్కెట్లో రూ. 56 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ స్మగ్లింగ్ రాకెట్కు సంబంధించి నలుగురు అంతర్రాష్ట్ర గంజాయి పెడ్లర్లను అరెస్ట్ చేయడంతో పాటు, రవాణాకు ఉపయోగించిన 2 కార్లు , 4 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశా టు మహారాష్ట్ర.. స్మగ్లర్ల స్కెచ్ ఇలా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముఠా ఒడిశా రాష్ట్రం నుండి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా గంజాయిని అక్రమంగా తరలిస్తోంది. ఇందుకోసం టాటా హారియర్, మారుతి ఎర్టిగా వంటి లగ్జరీ వాహనాలను వినియోగించారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు వీరు ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఇందులో ఒక వాహనాన్ని ‘పైలట్’ వాహనంగా ముందు పంపిస్తూ.. మార్గమధ్యంలో ఎక్కడైనా పోలీస్ చెక్పోస్టులు, తనిఖీలు ఉన్నాయా అనే సమాచారాన్ని వెనుక గంజాయితో వస్తున్న వాహనానికి అందిస్తూ ఎస్కార్ట్గా వ్యవహరించేవారు.
Also Read
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
నకిలీ నెంబర్ ప్లేట్లు.. ఇంటర్నెట్ కాలింగ్తో హైటెక్ మోసం
టోల్ గేట్లలో పోలీసుల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు స్మగ్లర్లు చాకచక్యంగా వాహనాలకు నకిలీ మహారాష్ట్ర (MH) నెంబర్ ప్లేట్లను ఉపయోగించారు. అంతేకాకుండా, సాధారణ ఫోన్ కాల్స్ చేస్తే పోలీసులు ట్యాప్ చేస్తారనే భయంతో, ఒకరికొకరు సమాచారం ఇచ్చుకోవడానికి కేవలం ఇంటర్నెట్ కాలింగ్ (యాప్స్) మాత్రమే వాడుతూ నిఘా తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు బొంగులూరు ఔటర్ రింగ్ రోడ్ (ORR) గేట్ సమీపంలో ఈ రెండు వాహనాలను అడ్డుకుని గంజాయిని పట్టుకున్నారు.
భారీ లాభాల దందా.. సూత్రధారుల కోసం వేట
స్మగ్లర్లు ఒడిశాలోని బెర్హంపూర్కు చెందిన సరఫరాదారు ప్రభిత్ర ప్రధాన్ నుండి కేవలం రూ. 4 వేలకే కిలో గంజాయిని కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఆ గంజాయిని మహారాష్ట్రకు తరలించి అక్కడ వినియోగదారులకు కిలో రూ. 20 వేల నుండి రూ. 30 వేల వరకు విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. కాగా, ఈ ముఠాలో కీలకమైన ప్రధాన సూత్రధారి ప్రణవ్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని డీసీపీ తెలిపారు. ఈ వ్యవహారంపై ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసి, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!