Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ బస్ట్
- 110 కిలోల గంజాయి, రెండు కార్లు స్వాధీనం
- నకిలీ నెంబర్ ప్లేట్లు, ఇంటర్నెట్ కాలింగ్తో స్మగ్లింగ్
- ప్రధాన సూత్రధారి కోసం పోలీసుల గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganja Smuggling : హైదరాబాద్ శివార్లలో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఒక ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శంషాబాద్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ , ఆదిబట్ల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్లో సుమారు 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ డీసీపీ రాజేష్ మీడియాకు వెల్లడించారు. సీజ్ చేసిన గంజాయి విలువ మార్కెట్లో రూ. 56 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ స్మగ్లింగ్ రాకెట్కు సంబంధించి నలుగురు అంతర్రాష్ట్ర గంజాయి పెడ్లర్లను అరెస్ట్ చేయడంతో పాటు, రవాణాకు ఉపయోగించిన 2 కార్లు , 4 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశా టు మహారాష్ట్ర.. స్మగ్లర్ల స్కెచ్ ఇలా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముఠా ఒడిశా రాష్ట్రం నుండి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా గంజాయిని అక్రమంగా తరలిస్తోంది. ఇందుకోసం టాటా హారియర్, మారుతి ఎర్టిగా వంటి లగ్జరీ వాహనాలను వినియోగించారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు వీరు ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఇందులో ఒక వాహనాన్ని ‘పైలట్’ వాహనంగా ముందు పంపిస్తూ.. మార్గమధ్యంలో ఎక్కడైనా పోలీస్ చెక్పోస్టులు, తనిఖీలు ఉన్నాయా అనే సమాచారాన్ని వెనుక గంజాయితో వస్తున్న వాహనానికి అందిస్తూ ఎస్కార్ట్గా వ్యవహరించేవారు.
Also Read
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
- Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
నకిలీ నెంబర్ ప్లేట్లు.. ఇంటర్నెట్ కాలింగ్తో హైటెక్ మోసం
టోల్ గేట్లలో పోలీసుల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు స్మగ్లర్లు చాకచక్యంగా వాహనాలకు నకిలీ మహారాష్ట్ర (MH) నెంబర్ ప్లేట్లను ఉపయోగించారు. అంతేకాకుండా, సాధారణ ఫోన్ కాల్స్ చేస్తే పోలీసులు ట్యాప్ చేస్తారనే భయంతో, ఒకరికొకరు సమాచారం ఇచ్చుకోవడానికి కేవలం ఇంటర్నెట్ కాలింగ్ (యాప్స్) మాత్రమే వాడుతూ నిఘా తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు బొంగులూరు ఔటర్ రింగ్ రోడ్ (ORR) గేట్ సమీపంలో ఈ రెండు వాహనాలను అడ్డుకుని గంజాయిని పట్టుకున్నారు.
భారీ లాభాల దందా.. సూత్రధారుల కోసం వేట
స్మగ్లర్లు ఒడిశాలోని బెర్హంపూర్కు చెందిన సరఫరాదారు ప్రభిత్ర ప్రధాన్ నుండి కేవలం రూ. 4 వేలకే కిలో గంజాయిని కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఆ గంజాయిని మహారాష్ట్రకు తరలించి అక్కడ వినియోగదారులకు కిలో రూ. 20 వేల నుండి రూ. 30 వేల వరకు విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. కాగా, ఈ ముఠాలో కీలకమైన ప్రధాన సూత్రధారి ప్రణవ్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని డీసీపీ తెలిపారు. ఈ వ్యవహారంపై ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసి, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!