Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ
- సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- ప్రజా రవాణాలో ప్రయాణించే వారి బాధ్యతపై మరోసారి చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. వైరల్ అవుతున్న ఓ వీడియో దేశవ్యాప్తంగా ‘సివిక్ సెన్స్’ (పౌర బాధ్యత)పై మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో ఓ మహిళ తన సీటు చుట్టూ పల్లికాయ పొట్టు వంటి ఆహార వ్యర్థాలను కోచ్ లోనే పడేసి, సీటు పక్కనే వాటర్ బాటిల్తో చేతులు కడుక్కుంటున్నట్లు కనిపిస్తోంది. రైలు కోచ్లోని డెడికేటెడ్ వాష్ ఏరియా ఉన్నప్పటికీ ఆమె అలా చేయడం ప్రజల్లో తీవ్ర అసహనానికి గురైంది.
రైలు కోచ్ డోర్ దగ్గర సీటు ఉన్నా, ఆమె లేచి వాష్ బేసిన్ వద్దకు వెళ్లకపోవడం గమనార్హం. ఇది ఏ రైలు, ఏ రూట్ అనేది స్పష్టంగా వెల్లడికాలేదు. ఈ వీడియో X (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్లలో వేగంగా వ్యాపించి, లక్షలాది వ్యూస్ సాధించింది. ఈ వైరల్ వీడియో మరోసారి ఒక విషయాన్ని గుర్తు చేసింది. పరిశుభ్రత అనేది కేవలం ప్రచార కార్యక్రమాలతోనే కాదు, ప్రతి వ్యక్తి రోజువారీ అలవాట్లతోనే సాధ్యమవుతుంది.
Also Read
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
- Supreme Court: ‘సర్’లో పేరు లేకపోతే పౌరసత్వం లేనట్టేనా.. సంక్షేమ పథకాలు నిలిపేస్తారా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
మళ్లీ తెరపైకి వచ్చిన ‘సివిక్ సెన్స్’ చర్చ
ఈ ఘటనతో ప్రజా రవాణాలో ప్రయాణించే వారి బాధ్యతపై మరోసారి చర్చ మొదలైంది. రైళ్లు, మెట్రోలు, బస్సులు వంటి ప్రజా ప్రదేశాల్లో చెత్త వేయడం, ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా ప్రవర్తించడం వంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఇటీవల కూడా రైళ్లలో చెత్త పేరుకుపోవడం, ప్రయాణికులు కోచ్లను అపరిశుభ్రంగా మార్చడం వంటి వీడియోలు వైరల్ అయ్యాయి.
సోషల్ మీడియాలో చర్చ
ఈ వీడియోపై కొందరు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతుండగా, మరికొందరు ప్రజల్లో సివిక్ సెన్స్ పెంపొందించేందుకు అవగాహన కార్యక్రమాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. ప్రజా ఆస్తులను కాపాడటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. బేసిక్ సివిక్ సెన్స్ లేమిగా విమర్శించారు. “డర్టీ ట్రైన్స్ ఎప్పుడూ గవర్నమెంట్ తప్పు కాదు, పీపుల్ బ్లేమ్ కూడా ఉంది” అని ఒక యూజర్ కామెంట్ చేశారు.
పరిశుభ్రత అందరి బాధ్యత
రైల్వేలు, బస్సులు, పార్కులు వంటి ప్రజా ప్రదేశాలను శుభ్రంగా ఉంచడం ప్రభుత్వంతో పాటు ప్రతి పౌరుడి బాధ్యత. ఉపయోగించిన ప్లాస్టిక్ బాటిళ్లు, టిష్యూ పేపర్లు, ఆహార ప్యాకెట్లు వంటి చెత్తను డస్ట్బిన్లో వేయడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా, ఇతరులకు కూడా మంచి సందేశాన్ని ఇవ్వవచ్చు. ప్రతి ప్రయాణీకుడి చిన్న చిన్న చర్యలే రైలు ప్రయాణాలను మరింత ఆహ్లాదకరంగా, శుభ్రంగా చేస్తాయి.
భారతీయ రైల్వేలు స్వచ్ఛ్ భారత్ మిషన్ కింద శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నప్పటికీ, ప్రయాణీకుల నుంచి సహకారం లేకపోవడం ఒక పెద్ద సవాల్. ఇంతకు ముందు కూడా రైలు కోచ్లలో చెత్త విసరడం, విండో బయటకు విసరడం వంటి ఘటనలు వైరల్ అయ్యాయి. ఇటీవలి ఘటనల్లో రైల్వే సిబ్బంది కూడా చెత్త బయటకు విసరడం వీడియోలు వచ్చాయి.
What an uncouth behaviour !!!!
We need mass education on civic sense in public places.pic.twitter.com/EzSbKVYnUE— Rishi Bagree (@rishibagree) June 27, 2026
తాజావార్తలు
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?