Munugode Bypoll: మునుగోడులో ఆసక్తికర ఘటన.. కాంగ్రెస్, బీఎస్పీ చీఫ్ల భేటీ.. సంతృప్తి వ్యక్తం చేసిన రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి.. అన్ని పార్టీల జాతీయ నేతల నుంచి రాష్ట్ర నేతలు, ఇతర జిల్లాల నేతలు.. ఇలా అంతా మునుగోడుకే క్యూ కడుతున్నారు.. తమ పార్టీ తరపున ప్రచారం చేస్తూ.. ఓట్లు అడుగుతున్నారు.. అయితే, మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఇవాళ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ప్రచారంలో ఎదురుపడ్డారు.. దీంతో.. నమస్తే ప్రవీణ్ అన్నా అంటూ.. ఆర్ఎస్ ప్రవీణ్ దగ్గరకు వెళ్లి పలుకరించి ఆలింగనం చేసుకున్నారు రేవంత్రెడ్డి.. ఇక, ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రేవంత్రెడ్డి.. సంతోషాన్ని వ్యక్తం చేశారు..
Read Also: Etela Rajender : ప్రపంచం మొత్తం మునుగోడు వైపు చూస్తుంది
Also Read
- Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
”మునుగోడుకు వెళ్తూ మార్గం మధ్యలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ గారిని కలిశాను. మా ఈ కలయిక యాధృచ్ఛికమే… సమ సమాజ ఉన్నతి కోసం ప్రవీణ్ లాంటి వారితో కలిసి భావాలు పంచుకోవడం సమాజానికి అవసరం, నాకు సంతృప్తి.” అంటూ రాసి.. ఆ ఫొటోలను షేర్ చేశారు రేవంత్రెడ్డి.. కాగా, మునుగోడులో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ, ప్రజాశాంతి లాంటి పార్టీలతో పాటు పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్లు కూడా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయిన విషయం తెలిసిందే.. కాంగ్రెస్ను వీడిన ఆయన.. ఈ సారి బీజేపీ నుంచి తన అదృష్ట్యాన్ని పరిక్షించుకోవడానికి సిద్ధం అయ్యారు. నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.
మునుగోడుకు వెళుతు మార్గమధ్యంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ గారిని కలిశాను. మా ఈ కలయిక యాదృచ్ఛికమే. సమ సమాజ ఉన్నతి కోసం ప్రవీణ్ లాంటి వారితో కలిసి భావాలు పంచుకోవడం సమాజానికి అవసరం, నాకు సంతృప్తి.@RSPraveenSwaero pic.twitter.com/mcLmGgegtO
— Revanth Reddy (@revanth_anumula) October 11, 2022
తాజావార్తలు
-
E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
-
Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
-
Modi-Delcy Rodriguez: మోడీతో వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!