శంషాబాద్లో దారుణం : ఆ పని చేశారని.. స్తంభానికి కట్టేసి గుండుకొట్టారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శంషాబాద్లో దారుణం చోటు చేసుకుంది. బ్యాటరీలను దొంగతనం చేసారంటూ ఇద్దరు యువకులను కరెంటు స్తంభానికు కట్టివేసి గుండు కొట్టించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. జరిగిన అవమానంతో బాధితులు స్థానిక ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శంషాబాద్ లోని అహ్మద్ నగర్ లో నివాసం ఉంటున్న మహమ్మద్ ఖుద్దూస్, ఎండి ఖాజాలు స్క్రాప్ బిజినెస్ చేస్తుంటారు. స్క్రాప్ బిజినెస్ తోపాటు చిన్న చిన్న దొంగతనాలు చేస్తారనే ఆరోపణలున్నాయి. కాగా గత కొంత కాలంగా అహ్మద్ నగర్ లో వాహనాలకు సంబంధించిన బ్యాటరీలు దొంగతనానికి గురవుతున్నాయి.
అలా చోరీ కాబడిన బ్యాటరీలు అదే కాలనీలో ఉంటున్న ఎండి ఖాజా అనే యువకుడి ఇంటిలో దొరికాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఖుద్దూస్ తో కలిసి ఖాజా బ్యాటరీలు దొంగిలించారనే కారణంతో అహ్మద్ కాలనీకి చెందిన కొంతమంది ఖుద్దూస్, ఖాజా లను బలవంతంగా స్థానిక మదీనా మసీదు సమీపంలోకి తీసుకొని వచ్చి అక్కడ కరెంటు స్తంభానికి కట్టివేసారు. ఖాజా ఇంటిలో దొరికిన బ్యాటరీలను ను ఖుద్దూస్, ఖాజాల మెడలో వేసి ఇద్దరికీ గుండు కొట్టించారు. జరిగిన అవమానంతో బాధితులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ అలీ, ఎండి జావేద్, ఎండి గౌస్, ఎండి భారీ ల పై కేసు నమోదు చేసుకున్న ఎయిర్ పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
- Telangana: ప్రాణాలు విడిచిన వారిని వరించిన విజయం..
- Chevella Bus Tragedy: బస్సు ప్రమాదంలో తల్లితో పాటు 3 నెలల చిన్నారి మృతి.. గుండెల్ని పిండేస్తున్న ఫోటో
తాజావార్తలు
-
Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
-
CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
-
Virosh: గ్లోబల్ రికార్డుల వేటలో విజయ్-రశ్మిక జోడీ!
-
Trump: పాపం ట్రంప్.. చైనాలో అమెరికా అధ్యక్షుడికి అవమానం!
-
Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!