Bathukamma Kunta : బతుకమ్మ కుంట బతికింది.. ఎంత బాగుందో ఇప్పుడు..
- బతుకమ్మ కుంట భూమిపై హక్కులేమీ లేవని హైకోర్టు తేల్చింది
- హైడ్రా చర్యలతో అక్రమ నిర్మాణాలు తొలగించి పునరుద్ధరణ ప్రారంభం
- వీ. హనుమంతరావు పత్రాల ఆధారంగా కోర్టులో విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bathukamma Kunta : హైదరాబాద్లోని అంబర్పేట ప్రాంతంలో ఉన్న బతుకమ్మ కుంటపై జరుగుతున్న అక్రమ కబ్జాలు అడ్డుకోగలిగిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్)కి హైకోర్టు విజయాన్ని అందించింది. ఎన్నో ఏళ్లుగా దాదాపు 20 ఎకరాల పైచిలుకు ఉన్న ఈ కుంట, క్రమంగా కబ్జాల బారిన పడి కనుమరుగవుతోంది. ప్రస్తుతం ఇందులో కేవలం 6 ఎకరాల కుంటే మిగిలి ఉండగా, హైడ్రా ప్రత్యేక చర్యలతో ఈ భాగాన్ని పునరుద్ధరించగలిగింది.
Prasanna Kumar Reddy: నా ఇంటిని టీడీపీ నేతలే విధ్వంసం చేశారు.. ప్రతి విమర్శకు నేను కట్టుబడి ఉన్నా..!
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
ఈ క్రమంలో, ఆ స్థలంపై హక్కులున్నాయంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. కుంట భూమిపై ఆయన్ను హక్కుదారుడిగా గుర్తించలేమని స్పష్టం చేస్తూ, బతుకమ్మ కుంట స్థలంగానే కొనసాగించాలని స్పష్టమైన తీర్పును వెలువరించింది. ‘అగ్రిమెంట్ ఆఫ్ సేల్’ ఆధారంగా తాను భూమి యజమానినని చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది.
బతుకమ్మ కుంటను రక్షించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు హైడ్రాకు పత్రాలు అందజేయడంతో, కమిషనర్ రంగనాథ్ స్వయంగా నవంబర్ 13న కుంటను పరిశీలించి పునరుద్ధరణకు ఆదేశాలు జారీ చేశారు. దీని వల్ల మొదట్లో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, విచారణ అనంతరం తుది తీర్పు హైడ్రా పక్షాన పడింది.
ఈ నేపథ్యంలో రంగనాథ్ స్పందిస్తూ, “బతుకమ్మ కుంటకు పూర్వ వైభవాన్ని తీసుకురావడమే లక్ష్యం. అక్కడ ప్రస్తుతం నివసిస్తున్న వారికి ఇబ్బంది లేకుండా తవ్వకాలు, అభివృద్ధి పనులు జరుగుతాయి,” అని అన్నారు. విజయానికి తోడ్పడిన ఉద్యోగులను హైడ్రా కార్యాలయంలో సన్మానించారు. ప్రస్తుతం పునరుద్ధరించిన ప్రాంతాన్ని పార్క్గా అభివృద్ధి చేయడం జరుగుతోంది. చెరువులపై కబ్జాలను అడ్డుకోవడంలో హైడ్రా కొనసాగిస్తున్న చొరవ, ఈ తీర్పుతో మరింత బలపడింది.
Floods: నేపాల్-చైనా బోర్డర్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన పోలీసులు, 200 వాహనాలు
తాజావార్తలు
-
Bengal Political Crisis: మమత కోటలో అధికారులు ఖాళీ.. మాజీ సీఎస్ నుంచి అడ్వకేట్ జనరల్ వరకు వరుసగా రాజీనామాలు!
-
VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..
-
Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
-
India-Pakistan: “పాకిస్తాన్తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!