Bathukamma Kunta : బతుకమ్మ కుంట బతికింది.. ఎంత బాగుందో ఇప్పుడు..
- బతుకమ్మ కుంట భూమిపై హక్కులేమీ లేవని హైకోర్టు తేల్చింది
- హైడ్రా చర్యలతో అక్రమ నిర్మాణాలు తొలగించి పునరుద్ధరణ ప్రారంభం
- వీ. హనుమంతరావు పత్రాల ఆధారంగా కోర్టులో విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bathukamma Kunta : హైదరాబాద్లోని అంబర్పేట ప్రాంతంలో ఉన్న బతుకమ్మ కుంటపై జరుగుతున్న అక్రమ కబ్జాలు అడ్డుకోగలిగిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్)కి హైకోర్టు విజయాన్ని అందించింది. ఎన్నో ఏళ్లుగా దాదాపు 20 ఎకరాల పైచిలుకు ఉన్న ఈ కుంట, క్రమంగా కబ్జాల బారిన పడి కనుమరుగవుతోంది. ప్రస్తుతం ఇందులో కేవలం 6 ఎకరాల కుంటే మిగిలి ఉండగా, హైడ్రా ప్రత్యేక చర్యలతో ఈ భాగాన్ని పునరుద్ధరించగలిగింది.
Prasanna Kumar Reddy: నా ఇంటిని టీడీపీ నేతలే విధ్వంసం చేశారు.. ప్రతి విమర్శకు నేను కట్టుబడి ఉన్నా..!
Also Read
- Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
- Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్...
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
ఈ క్రమంలో, ఆ స్థలంపై హక్కులున్నాయంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. కుంట భూమిపై ఆయన్ను హక్కుదారుడిగా గుర్తించలేమని స్పష్టం చేస్తూ, బతుకమ్మ కుంట స్థలంగానే కొనసాగించాలని స్పష్టమైన తీర్పును వెలువరించింది. ‘అగ్రిమెంట్ ఆఫ్ సేల్’ ఆధారంగా తాను భూమి యజమానినని చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది.
బతుకమ్మ కుంటను రక్షించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు హైడ్రాకు పత్రాలు అందజేయడంతో, కమిషనర్ రంగనాథ్ స్వయంగా నవంబర్ 13న కుంటను పరిశీలించి పునరుద్ధరణకు ఆదేశాలు జారీ చేశారు. దీని వల్ల మొదట్లో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, విచారణ అనంతరం తుది తీర్పు హైడ్రా పక్షాన పడింది.
ఈ నేపథ్యంలో రంగనాథ్ స్పందిస్తూ, “బతుకమ్మ కుంటకు పూర్వ వైభవాన్ని తీసుకురావడమే లక్ష్యం. అక్కడ ప్రస్తుతం నివసిస్తున్న వారికి ఇబ్బంది లేకుండా తవ్వకాలు, అభివృద్ధి పనులు జరుగుతాయి,” అని అన్నారు. విజయానికి తోడ్పడిన ఉద్యోగులను హైడ్రా కార్యాలయంలో సన్మానించారు. ప్రస్తుతం పునరుద్ధరించిన ప్రాంతాన్ని పార్క్గా అభివృద్ధి చేయడం జరుగుతోంది. చెరువులపై కబ్జాలను అడ్డుకోవడంలో హైడ్రా కొనసాగిస్తున్న చొరవ, ఈ తీర్పుతో మరింత బలపడింది.
Floods: నేపాల్-చైనా బోర్డర్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన పోలీసులు, 200 వాహనాలు
తాజావార్తలు
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
-
World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్లో ఆశాజనక ఫలితాలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
-
Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!