Floods: నేపాల్-చైనా బోర్డర్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన పోలీసులు, 200 వాహనాలు
- నేపాల్-చైనా బోర్డర్లో ఆకస్మిక వరదలు
- కొట్టుకుపోయిన పోలీసులు, 200 వాహనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేపాల్-చైనా సరిహద్దులో ఆకస్మిక వరదలు హడలెత్తించాయి. రసువా జిల్లాలో సరిహద్దుగా ఉన్న భోటేకోషి నది ఒక్కసారిగా ఉప్పొంగింది. దీంతో ఊహించని రీతిలో ప్రళయం సంభవించింది. మిటేరి వంతెన, డ్రై పోర్టు దగ్గర నిలిపి ఉన్న వందలాది వాహనాలు ఒక్కసారిగా కొట్టుకుపోయాయి.
ఇది కూడా చదవండి: Bihar: బీజేపీ నేత ఖేమ్కా హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడు ఎన్కౌంటర్
Also Read
- Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
- Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
- Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్లో ఉగ్రదాడి!
- Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
చైనా భూభాగంలో ఊహించని రీతిలో కుండపోత వర్షాలు కురిశాయి. అతి భారీ వర్షాలు కురవడంతో మంగళవారం తెల్లవారుజామున సరిహద్దు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. నేపాల్లోని తైమూర్ ప్రాంతంలో అనేక మౌలిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయి.
ఇది కూడా చదవండి: Prasanna vs Prashanthi: పీహెచ్డీ పాలిటిక్స్..! నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కలకలం
భోటేకోషి నది వెంబడి ఉన్న కస్టమ్స్ పోర్టులో నిలిపి ఉన్న 200 వాహనాలు కొట్టుకుపోయాయని రసువా చీఫ్ డిస్ట్రిక్ ఆఫీసర్ అర్జున్ పౌడెల్ తెలిపారు. నేపాల్-చైనాను కలిపే వంతెను కొట్టుకుపోయిందని చెప్పారు. ఇక చాలా మంది వ్యాపారులు గల్లంతైనట్లు చెప్పుకొచ్చారు. ఇక నేపాల్కు చెందిన 12 మంది పోలీసులు కూడా గల్లంతైనట్లు సమాచారం. ప్రస్తుతం వాతావరణం ప్రతికూలంగా ఉందని.. పరిస్థితులు శాంతించగానే నేపాల్ సైన్యం సహాయ చర్యలు చేపడుతుందని వెల్లడించారు. ఎంతమంది గల్లంతయ్యారన్న విషయాన్ని ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ విపత్తు సంభవించినట్లు తెలుస్తోంది. అందరూ గాఢ నిద్రలో ఉండగా ఊహించని రీతిలో వరద దూసుకొచ్చింది. ఎంత మంది చనిపోయారన్న విషయం అధికారికంగా ప్రకటించలేదు. వాహనాలతో పాటు ప్రజలు కొట్టుకుపోయారని అధికారులు చెబుతున్నారు.
వరదలకు గల కారణాలను అధికారులు అంచనా వేస్తున్నారు. టిబెటన్ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతోనే నదలు ఉప్పొంగాయని భావిస్తున్నారు. ఇక త్రిశూలి నది ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదికారులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Priyanka Chopra: విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన ప్రియాంక చోప్రా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్లో త్రిష..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ
ట్రెండింగ్
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత