Konda Surekha: మరో వివాదంలో కొండా సురేఖ.. రాజన్న కోడెల వివాదంలో మంత్రి పేరు..
- మంత్రి కొండా సురేఖ సిఫార్సుతో రాజన్న ఆలయ కోడెలు పక్కదారి..
- నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తికి 49 కోడెలను అప్పగించిన వైనం..
- విశ్వహిందూ పరిషత్, బజరంగ్దల్ నాయకుల ఫిర్యాదుతో వెలుగులోకి అక్రమాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Surekha: అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. వేములవాడ రాజన్న కోడెల వివాదంలో మంత్రి పేరు వినిపిస్తోంది. కోడెల పంపిణీలో ఆలయ ఈఓ వినోద్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కోడెలు దారి తప్పుతున్నారని ఆరోపిస్తూ విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకుల ఫిర్యాదుతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మంత్రి కొండా సురేఖ సిఫార్సుతో రాజన్న ఆలయ కోడెలు పక్కదారి పడుతున్నాయని ఆందోళన చేపట్టారు. మంత్రి సూచన మేరకు ఆగస్టు 12న రాంబాబు అనే వ్యక్తికి ఆలయ అధికారులు 49 కోడళ్లను అందజేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
Reasd also: CM Viral Tweet: ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి.. సీఎం ట్వీట్ వైరల్..
Also Read
మంత్రిని మెప్పించడం కోసమే నిబంధనలకు విరుద్ధంగా కోడళ్లను అప్పగించారనే ప్రచారం సాగుతోంది. కేవలం రెండు, మూడు కోడెలను మాత్రమే రైతులకు అందజేసి మంత్రి సూచన మేరకు రాంబాబు అనే వ్యక్తికి ఒకేసారి 49 కోడెలను ఇవ్వడంతో వివాదాస్పదమైంది. కోడెలను టెండర్ ద్వారా పొందినట్లు రాంబాబు ఇప్పటికే పోలీసులకు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో మంత్రి అనుచరుడు రాంబాబుపై వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
Reasd also: Viral Video: ఇదేక్కడి మాస్ రా మావా? పడుకుని కాళ్లతో స్టీరింగ్ని కంట్రోల్ చేస్తున్న లారీ డ్రైవర్(వీడియో)
49 పశువుల వ్యాపారి అయిన మంత్రి అనుచరుడికి కోడెలను అప్పగించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తికి కోడెదూడలను కేటాయించడంపై విచారణ జరిపించాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కోడెల వ్యవహారం మరోసారి తెరపైకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వేములవాడ రాజన్న ఆలయ కోడెల తరలింపు పై, రాజన్న ఆలయ ఈఓ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల ధర్నా చేపట్టింది. ఈవోను సస్పెండ్ చేసి,విచారణ చేపట్టాలని అన్నారు. మంత్రి అనుచరులకు రాజన్న కోడెలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. మంత్రివర్గం నుండి కొండ సురేఖను భర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు.
Pushpa 2 : పుష్ప 2 సినిమా చూడాలన్న ఆతృతలో ట్రైన్ చూసుకోకపోవడంతో తీవ్ర విషాదం
తాజావార్తలు
-
CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
-
US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ పోర్టల్ ప్రారంభం.. చివరి తేదీని ప్రకటించిన ఎన్టీఏ
-
Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!