Konda Surekha: మరో వివాదంలో కొండా సురేఖ.. రాజన్న కోడెల వివాదంలో మంత్రి పేరు..
- మంత్రి కొండా సురేఖ సిఫార్సుతో రాజన్న ఆలయ కోడెలు పక్కదారి..
- నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తికి 49 కోడెలను అప్పగించిన వైనం..
- విశ్వహిందూ పరిషత్, బజరంగ్దల్ నాయకుల ఫిర్యాదుతో వెలుగులోకి అక్రమాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Surekha: అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. వేములవాడ రాజన్న కోడెల వివాదంలో మంత్రి పేరు వినిపిస్తోంది. కోడెల పంపిణీలో ఆలయ ఈఓ వినోద్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కోడెలు దారి తప్పుతున్నారని ఆరోపిస్తూ విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకుల ఫిర్యాదుతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మంత్రి కొండా సురేఖ సిఫార్సుతో రాజన్న ఆలయ కోడెలు పక్కదారి పడుతున్నాయని ఆందోళన చేపట్టారు. మంత్రి సూచన మేరకు ఆగస్టు 12న రాంబాబు అనే వ్యక్తికి ఆలయ అధికారులు 49 కోడళ్లను అందజేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
Reasd also: CM Viral Tweet: ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి.. సీఎం ట్వీట్ వైరల్..
Also Read
మంత్రిని మెప్పించడం కోసమే నిబంధనలకు విరుద్ధంగా కోడళ్లను అప్పగించారనే ప్రచారం సాగుతోంది. కేవలం రెండు, మూడు కోడెలను మాత్రమే రైతులకు అందజేసి మంత్రి సూచన మేరకు రాంబాబు అనే వ్యక్తికి ఒకేసారి 49 కోడెలను ఇవ్వడంతో వివాదాస్పదమైంది. కోడెలను టెండర్ ద్వారా పొందినట్లు రాంబాబు ఇప్పటికే పోలీసులకు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో మంత్రి అనుచరుడు రాంబాబుపై వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
Reasd also: Viral Video: ఇదేక్కడి మాస్ రా మావా? పడుకుని కాళ్లతో స్టీరింగ్ని కంట్రోల్ చేస్తున్న లారీ డ్రైవర్(వీడియో)
49 పశువుల వ్యాపారి అయిన మంత్రి అనుచరుడికి కోడెలను అప్పగించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తికి కోడెదూడలను కేటాయించడంపై విచారణ జరిపించాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కోడెల వ్యవహారం మరోసారి తెరపైకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వేములవాడ రాజన్న ఆలయ కోడెల తరలింపు పై, రాజన్న ఆలయ ఈఓ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల ధర్నా చేపట్టింది. ఈవోను సస్పెండ్ చేసి,విచారణ చేపట్టాలని అన్నారు. మంత్రి అనుచరులకు రాజన్న కోడెలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. మంత్రివర్గం నుండి కొండ సురేఖను భర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు.
Pushpa 2 : పుష్ప 2 సినిమా చూడాలన్న ఆతృతలో ట్రైన్ చూసుకోకపోవడంతో తీవ్ర విషాదం
తాజావార్తలు
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!