Pushpa 2 : పుష్ప 2 సినిమా చూడాలన్న ఆతృతలో ట్రైన్ చూసుకోకపోవడంతో తీవ్ర విషాదం
- పుష్ప 2 సినిమాకు పోయి మరో యువకుడి మరణం
- ఆతృతలో పట్టాలుదాటుతుండగా ఢీ కొట్టిన రైలు
- స్నేహితుల కోసం వెతుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. ప్రస్తుతం థియేటర్లను పుష్ప రాజ్ రూల్ చేస్తున్నాడు. బాక్సాఫీసు వద్ద సంచలన కలెక్షన్లతో దుమ్ము లేపుతున్నాడు. ఈ సినిమాను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఈ క్రమంలోనే వారి కుటుంబాలకు విషాదం నింపుతున్నారు. గురువారం ఉదయం దొడ్డబల్పూర్ సమీపంలోని బాశెట్టిహళ్లి వద్ద వేగంగా వస్తున్న రైలు ఢీకొనడంతో ప్రవీణ్ తమచలం (19) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రవీణ్ పుష్ప-2 స్క్రీనింగ్ థియేటర్కి చేరుకునే హడావిడిలో రైలు పట్టాలు దాటుతున్నాడు. ఈ క్రమంలోనే రైలు ఢీకొట్టడంతో ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
Read Also:Elon Musk: ఎలాన్ మస్క్తో ఇజ్రాయెల్ అధ్యక్షుడి చర్చలు.. ఎందుకంటే?
Also Read
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో ప్రవీణ్ తమచలం అక్కడికక్కడే మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళానికి చెందిన ప్రవీణ్ ఐటీఐ డిప్లొమా హోల్డర్గా ఉంటూ బాశెట్టిహళ్లి పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి అదే ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉండేవాడు. ఉదయం 10 గంటలకు పుష్ప-2 షో చూసేందుకు గాంధీనగర్లోని వైభవ్ థియేటర్కి ప్రవీణ్, అతని స్నేహితులు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి నుంచి పారిపోయిన ప్రవీణ్ ఇద్దరు స్నేహితుల కోసం పోలీసులు ప్రస్తుతం వెతుకుతున్నారు. ఈ సంఘటన, విషాదానికి దారితీసిన పరిస్థితుల గురించి మరిన్ని వివరాలను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Read Also:Eknath Shinde: హోం మంత్రి పదవి కావాలని ఏక్నాథ్ షిండే డిమాండ్..
తాజావార్తలు
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
-
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!