Raja Singh : మార్వాడి గో బ్యాక్ అనేది అర్బన్ నక్సలైట్ల కుట్ర
- కోమటీలపై జరిగిన కుట్రలే ఇప్పుడు మార్వాడీలపై
- గుజరాతీ, మర్వాడీ, రాజస్థానీ వర్గాలు తెలంగాణ ఆర్థిక బలం
- మార్వాడీలు అన్ని పార్టీల్లో ఉన్నారు.. కేవలం బీజేపీ వారే కాదు
- రేవంత్ రెడ్డి ఈ మంటలను ఆపాలని రాజాసింగ్ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మార్వాడీలపై జరుగుతున్న ఆరోపణలకు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మార్వడి గో బ్యాక్ అనేది అర్బన్ నక్సలైట్ల కుట్ర మాత్రమే” అని ఆయన పేర్కొన్నారు. రాజాసింగ్ మాట్లాడుతూ, గతంలో కోమటీలపై కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని గుర్తుచేశారు. ఆ సమయంలో కోమటి వర్గం సంఘటితంగా ఎదుర్కొని విజయం సాధించిందని అన్నారు. రాజకీయంగా గుర్తింపు లేని వారు కొత్త ఇష్యూ సృష్టించి అల్లర్లు రేపుతున్నారని వ్యాఖ్యానించారు.
గుజరాతీ, మర్వాడీ, రాజస్థానీ వర్గాలు వందల ఏళ్లుగా తెలంగాణలో నివసిస్తున్నారని, రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెడుతున్నారని రాజాసింగ్ తెలిపారు. “ఎవరు ఏ వ్యాపారం చేయాలనుకున్నా చేయొచ్చు, వాళ్లు ఎప్పటినుంచో చేస్తున్నారు. ఫ్రూట్, ఫ్లవర్ వ్యాపారం ఎవరి చేతుల్లో ఉందో చూడండి. ఓల్డ్ సిటీ బంగ్లాదేశ్, రోహింగ్యాల అడ్డాగా మారింది. దానిపై ఎవరూ మాట్లాడటం లేదు” అని ఆయన ప్రశ్నించారు. గుజరాతీలను టెర్రరిస్టులుగా పిలవడం తప్పు అని రాజాసింగ్ అన్నారు. “అలా అయితే మోడీ, సర్దార్ పటేల్, మహాత్మ గాంధీ కూడా టెర్రరిస్టులా? ఇది అసంబద్ధమైన మాట” అని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఈ మంటలను ఆపాలని, పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. “డూప్లికేట్ వస్తువులు అమ్మితే పోలీసులకు ఫిర్యాదు చేయండి. పిర్యాదు చేస్తే కేసు నమోదవుతుంది” అని సూచించారు.
Also Read
- Ration Card eKYC: మీరు ఈకేవైసీ పూర్తి చేశారా..? స్టేటస్ను సింపుల్గా తెలుసుకోండిలా..
- Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. కొత్త హెల్త్ స్కీమ్ డ్రాఫ్ట్ విడుదల.!
- Telangana RERA : తెలంగాణ రియల్ ఎస్టేట్కు ఊరట.. RERA ప్రాజెక్టులకు 4 నెలల గడువు.!
- OTR : తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పదవికి లైన్ క్లియర్.. బరిలో బాలు నాయక్?
తాను ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కుటుంబానికి చెందినవాడినైనా తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తున్నానని రాజాసింగ్ అన్నారు. “తెలంగాణ సమాజం గౌరవప్రదమైన సమాజం. మార్వాడీలు ఎవరి ట్రాప్లో పడొద్దు. కమ్యూనిస్టులు ఇలాంటివి చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి” అని పిలుపునిచ్చారు. మార్వాడీలు కేవలం బీజేపీలోనే లేరని, కాంగ్రెస్, బీఆర్ఎస్లో కూడా ఉన్నారని రాజాసింగ్ తెలిపారు. “బీజేపీలో 70 శాతం ఉంటే, మిగతా 30 శాతం ఇతర పార్టీల్లో ఉన్నారు. మార్వాడీలపై రాజకీయాలు చేస్తే నష్టం చేసుకునేది మీరు మాత్రమే” అని హెచ్చరించారు.
Shocking : కేపీహెచ్బీలో ఘోరం.. వేశ్యకు విటుడికి మధ్య ఘర్షణ.. కత్తితో దాడి
తాజావార్తలు
-
Commonwealth Games 2026: భారత్కు డబుల్ మెడల్.. నీరజ్ చోప్రాకు రజతం, యశ్వీర్ సింగ్కు కాంస్యం
-
Aaron Finch: వరల్డ్ క్రికెట్లో కోహ్లీనే తోపు.. రెండో స్థానంలో సచిన్.. ఫించ్ సంచలన ర్యాంకింగ్స్
-
Jagapathi Babu: ఎవరూ నన్ను కొట్టలేదు.. అసలు నిజం చెప్పి ఊరట ఇచ్చిన జగ్గూభాయ్!
-
PM Modi: ‘తిట్లతో ఏ సమస్యా పరిష్కారం కాదు’.. తప్పుదారి పట్టిన యువతకు సరైన మార్గం చూపాలి.. ప్రధాని మోడీ కొత్త వీడియో..
-
Bhogapuram International Airport: నేడే భోగాపురం ఎయిర్పోర్ట్ జాతికి అంకితం.. మోదీ పర్యటనకు సర్వం సిద్ధం.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!