Raja Singh : మార్వాడి గో బ్యాక్ అనేది అర్బన్ నక్సలైట్ల కుట్ర
- కోమటీలపై జరిగిన కుట్రలే ఇప్పుడు మార్వాడీలపై
- గుజరాతీ, మర్వాడీ, రాజస్థానీ వర్గాలు తెలంగాణ ఆర్థిక బలం
- మార్వాడీలు అన్ని పార్టీల్లో ఉన్నారు.. కేవలం బీజేపీ వారే కాదు
- రేవంత్ రెడ్డి ఈ మంటలను ఆపాలని రాజాసింగ్ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మార్వాడీలపై జరుగుతున్న ఆరోపణలకు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మార్వడి గో బ్యాక్ అనేది అర్బన్ నక్సలైట్ల కుట్ర మాత్రమే” అని ఆయన పేర్కొన్నారు. రాజాసింగ్ మాట్లాడుతూ, గతంలో కోమటీలపై కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని గుర్తుచేశారు. ఆ సమయంలో కోమటి వర్గం సంఘటితంగా ఎదుర్కొని విజయం సాధించిందని అన్నారు. రాజకీయంగా గుర్తింపు లేని వారు కొత్త ఇష్యూ సృష్టించి అల్లర్లు రేపుతున్నారని వ్యాఖ్యానించారు.
గుజరాతీ, మర్వాడీ, రాజస్థానీ వర్గాలు వందల ఏళ్లుగా తెలంగాణలో నివసిస్తున్నారని, రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెడుతున్నారని రాజాసింగ్ తెలిపారు. “ఎవరు ఏ వ్యాపారం చేయాలనుకున్నా చేయొచ్చు, వాళ్లు ఎప్పటినుంచో చేస్తున్నారు. ఫ్రూట్, ఫ్లవర్ వ్యాపారం ఎవరి చేతుల్లో ఉందో చూడండి. ఓల్డ్ సిటీ బంగ్లాదేశ్, రోహింగ్యాల అడ్డాగా మారింది. దానిపై ఎవరూ మాట్లాడటం లేదు” అని ఆయన ప్రశ్నించారు. గుజరాతీలను టెర్రరిస్టులుగా పిలవడం తప్పు అని రాజాసింగ్ అన్నారు. “అలా అయితే మోడీ, సర్దార్ పటేల్, మహాత్మ గాంధీ కూడా టెర్రరిస్టులా? ఇది అసంబద్ధమైన మాట” అని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఈ మంటలను ఆపాలని, పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. “డూప్లికేట్ వస్తువులు అమ్మితే పోలీసులకు ఫిర్యాదు చేయండి. పిర్యాదు చేస్తే కేసు నమోదవుతుంది” అని సూచించారు.
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
తాను ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కుటుంబానికి చెందినవాడినైనా తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తున్నానని రాజాసింగ్ అన్నారు. “తెలంగాణ సమాజం గౌరవప్రదమైన సమాజం. మార్వాడీలు ఎవరి ట్రాప్లో పడొద్దు. కమ్యూనిస్టులు ఇలాంటివి చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి” అని పిలుపునిచ్చారు. మార్వాడీలు కేవలం బీజేపీలోనే లేరని, కాంగ్రెస్, బీఆర్ఎస్లో కూడా ఉన్నారని రాజాసింగ్ తెలిపారు. “బీజేపీలో 70 శాతం ఉంటే, మిగతా 30 శాతం ఇతర పార్టీల్లో ఉన్నారు. మార్వాడీలపై రాజకీయాలు చేస్తే నష్టం చేసుకునేది మీరు మాత్రమే” అని హెచ్చరించారు.
Shocking : కేపీహెచ్బీలో ఘోరం.. వేశ్యకు విటుడికి మధ్య ఘర్షణ.. కత్తితో దాడి
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!