Raja Singh: కేసీఆర్ ‘వినాశకాలే విపరీత బుద్ధి’గా వ్యహరిస్తున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు నిలిపేయడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగంపేటకు రాకుండా పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారంటూ మండి పడ్డారు. సీఎం డైరెక్షన్ లోనే సభకు రాకుండా పోలీసులు కుట్ర చేశారని ఆరోపించారు. అయినా టీఆర్ఎస్ కుట్రలను చేధించుకుని బేగంపేట సభకు బీజేపీ కార్యకర్తలు వచ్చారని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ‘వినాశకాలే విపరీత బుద్ధి’గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
బేగంపేట ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉన్న అనేక కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యిందంటూ బీజేపీ కార్యకర్తల వాహనాలను పోలీసులు డైవర్ట్ చేశారని రాజాసింగ్ ఆరోపించారు. ప్రధానమంత్రి బేగంపేట ఎయిర్ పోర్టుకు రావడం మరింత ఆలస్యం కాబోతుందంటూ దుష్ఫ్రచారం చేశారన్నారు. వాహనాల పార్కింగ్ పేరుతో చాలా ఇబ్బందులు కలుగ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగంపేట స్వాగత సభకు అనుమతి ఉన్నప్పటికీ మితిమీరిన ఆంక్షలతో కార్యకర్తలు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు రాజాసింగ్ ఆరోపించారు. ప్రధాని స్వాగత సభ సక్సెస్ కాకుండా చేయాలన్న సీఎం డైరెక్షన్ లోనే పోలీసులు పనిచేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పతనం ఖాయమైపోయిందని ధ్వజమెత్తారు.
Also Read
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
- CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
సభను ఫెయిల్ చేయాలని సీఎం వేసిన ఎత్తుగడ విఫలమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ‘‘సీఎం గారు…మీరు ఫెయిల్ చేయాలని చూసినా, మీ డైరెక్షన్ లోనే పోలీసులు అనేక ఆంక్షలు విధించినా వాటిని దాటుకుని కార్యకర్తలు తరలివచ్చి సభను సక్సెస్ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అని సూచించారు. సీఎం అడుగులకు మడుగులొత్తుతూ రాజ్యాంగం, చట్టాలకు, నిబంధనలను భిన్నంగా వ్యవహరిస్తున్న పోలీసులకు కౌంట్ డౌన్ మొదలైందనే విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించారు. ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఎన్వీఎస్ ప్రభాకర్ అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!