Raghunandan Rao : కవిత కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ రఘునందన్ రావు
- కవితను బీజేపీలో చేర్చుకునే ప్రసక్తేలేదు
- హరీష్-రేవంత్ ఒకే ఫ్లైట్లో వచ్చారనేది నిజం
- ఫ్లైట్లో వాళ్లు నన్ను ఓడించడం విషయం గురించే మాట్లాడుకున్నారు
- కవిత కొత్త పార్టీ పెడుతుంది
- ఆమె రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తి కాదు. -ఎంపీ రఘునందన్రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghunandan Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత నిర్వహించిన తాజా ప్రెస్మీట్పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. కవిత తన మీడియా సమావేశంలో కొత్తగా చెప్పిన అంశాలేమీ లేవని విమర్శించారు. మరికొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావుతో కుమ్మక్కయ్యారని తాను ఇంతకుముందే చెప్పానని రఘునందన్ గుర్తుచేశారు. “బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై నేను మాట్లాడదల్చుకోను. అయితే కవిత ప్రస్తావించిన మోకిల ప్రాజెక్టు అవకతవకలపై సమగ్ర విచారణ జరగాలి” అని అన్నారు.
KTR : ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికల తర్వాత చెప్పుల జాతర
Also Read
- Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
కవితను బీజేపీలో చేర్చుకునే ప్రసక్తేలేదని, హరీష్-రేవంత్ ఒకే ఫ్లైట్లో వచ్చారనేది నిజమన్నారు. ఫ్లైట్లో వాళ్లు నన్ను ఓడించడం విషయం గురించే మాట్లాడుకున్నారని, కవిత కొత్త పార్టీ పెడుతుందన్నారు రఘునందన్ రావు. ఆమె రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తి కాదని ఎంపీ రఘునందన్రావు వ్యాఖ్యానించారు. అలాగే, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు చేసిన అక్రమాలపై కూడా విచారణ అవసరమని డిమాండ్ చేశారు. గతంలో జడ్పీ అధ్యక్షుడి ఎన్నికల్లో తాను ఎదుర్కొన్న పరిస్థితులను కేసీఆర్కు వివరించినా, అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
మెదక్ ఎంపీ ఎన్నికల్లో తనకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు జరిగినట్టు కూడా గుర్తు చేశారు. “కవిత నేటి ప్రెస్మీట్తో బీఆర్ఎస్ అవినీతి బహిర్గతమైంది. మళ్లీ వచ్చే ఎపిసోడ్లో బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతిపై మరిన్ని విషయాలు బయటపెడితే బాగుంటుంది. అధికారంలో ఉన్నప్పుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు చేసిన అక్రమాలపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలి” అని రఘునందన్ రావు ప్రశ్నించారు.
బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్పై కవిత ఆగ్రహం పార్టీ, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా
తాజావార్తలు
-
Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
-
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
-
Regina Cassandra : హీరోయిన్ నుండి విలన్ పాత్రలకు షిఫ్ట్ అయిన రెజీనా కాసాండ్రా
-
OPPO Find X9s: సగం ధరకే ఒప్పో Find X9s.. 12GB RAM, 50MP కెమెరా, 7025mAh బ్యాటరీతో ప్రీమియం 5G ఫోన్
-
Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!