R. Krishnaiah: బీసీలకు బీఆర్ఎస్ అన్యాయం చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక వైపు బీసీలకు 50 శాతం టికెట్లు పెంచాలని బీసీ సంఘాలు, బీసీ నేతలు డిమాండ్ చేస్తుంటే.. బీఆర్ఎస్ పార్టీ నిన్న (మంగళవారం) ప్రకటించిన 115 సీట్లలో బీసీలకు కేవలం 21 సీట్లు మాత్రమే కేటాయించింది. గతంలో ఇచ్చిన సీట్ల కంటే రెండు స్థానాలను తగ్గించి 21 మంది అభ్యర్థులకే ఎమ్మెల్యే సీట్లను కేసీఆర్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రకటించిన తొలి జాబితాలో బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: German Minister: యూపీఐ పనితీరు చూసి ఆశ్చర్యపోయిన జర్మనీ మంత్రి
Also Read
బీఆర్ఎస్ పార్టీ టికెట్ల కేటాయింపులో పెంచేది పోయి తగ్గించి బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తే బీసీలు ఏమాత్రం సహించరని జనాభాను అత్యధిక శాతం కలిగిన బీసీలు కేవలం 10 శాతం సీట్లు కేటాయించి అవమానపరచారని.. కేవలం 10 శాతం జనాభా కలిగిన అగ్రకులాలకు 60 శాతం సీట్లు కేటాయించి.. బీసీల ఆగ్రహానికి గురవద్దని హెచ్చరించారు. ఓట్లు బీసీలవి జనాభా బీసీలది.. చారిత్రాత్మక అన్యాయం జరుగుతుందని గతంలో కేటాయించిన కామారెడ్డి, హుజురాబాద్ సీట్లను కూడా తిరిగి బీసీలకు కేటాయించకుండా.. బీసీల పట్ల మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీఆర్ఎస్ పార్టీ ఇకనైనా బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
Read Also: Endowment Lands: దేవాదాయ భూములపై చట్ట సవరణ.. ఇక, ఆ భూములు స్వాధీనం..
బీసీలకు అన్యాయం జరుగుతుంటే చూస్తు.. ఊరుకునే ప్రసక్తి లేదని ఆర్. కృష్ణయ్య అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వెంటనే బీసీలకు మరిన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో బీసీలు.. బీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.
- Tags
- Alert
- BCs
- cm kcr
- R Krishnaiah
- telangana
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..