High Interest: అప్పుకు చక్రవడ్డీ ఇవ్వలేదని కిడ్నాప్ చేసి చిత్రహింసలు.. మాజీ హోంగార్డు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Interest: పేద, సామాన్య ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ బిందాస్ గా వడ్డీ వ్యాపారాన్ని సాగిస్తూ పేద ప్రజలను దోచుకుంటున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో సామాన్య కుటుంబం బతకడం కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి, పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్లు తదితర అత్యవసర అవసరాల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రజల అవసరాలను అవకాశంగా తీసుకుని వడ్డీ వ్యాపారులు వేలల్లో ఉంటే ప్రామిసరీ నోటు, లక్షల్లో ఉంటే ఆస్తి పత్రాలు ఉంచుకుని రూ.3 నుంచి రూ.10 వరకు వడ్డీకి డబ్బులు ఇస్తున్నారు. దీంతో తీసుకున్న అప్పుకు అసలు, వడ్డీ, వడ్డీ, చక్రవడ్డీ, వడ్డీ కట్టలేక, ఆస్తులు విడిపించుకోలేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చాలా మంది వడ్డీ వ్యాపారుల ఊబిలో కూరుకుపోయి అప్పులు తీర్చలేక సతమతమవుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. తాజాగా నగరంలో ఓ ప్రైవేట్ ఫైనాన్షియర్ దాడిలో మాజీ హోంగార్డు మృతి చెందాడు.
Read also: DK Aruna: మహిళ బిల్లును కవిత కోసమే మోడీ పెడుతున్నట్టు మాట్లాడుతుంది..! కవితపై డీకే అరుణ ఫైర్..
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
ఐఎస్ సదన్ భానునగర్ కు చెందిన మాజీ హోంగార్డు మహ్మద్ రిజ్వాన్ ఓ ప్రైవేట్ ఫైనాన్షియర్ వద్ద రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. ఇటీవలి కాలంలో అసలు, వడ్డీతో అప్పు చెల్లించాడు. అయితే రెండు రోజుల క్రితం నాంపల్లికి చెందిన ఓ ముఠా ఐఎస్ సదన్ నుంచి రిజ్వాన్ను కిడ్నాప్ చేసి నాంపల్లిలోని ఓ భవనంలో ఉంచింది. రెండు రోజుల పాటు చిత్ర హింసలకు గురిచేసింది. విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి రూ. 2 లక్షలు చెల్లించి కొడుకును విడిపించుకున్నాడు. పోలీసులకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో తండ్రి ఫిర్యాదు చేయలేకపోయాడు. నిందితుల దెబ్బలు తట్టుకోలేక బాధితుడిని ఇంటికి తీసుకొచ్చి ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రిజ్వాన్ మృతి చెందడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకు చిత్రహింసల వల్లే చనిపోయాడని ఓ ప్రైవేట్ ఫైనాన్షియర్ పై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Health Tips : మీరు రోజూ చాక్లేట్ తింటారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే..
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!