DK Aruna: మహిళ బిల్లును కవిత కోసమే మోడీ పెడుతున్నట్టు మాట్లాడుతుంది..! కవితపై డీకే అరుణ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Aruna: మహిళ బిల్లును కవిత కోసమే మోడీ పెడుతున్నట్టు మాట్లాడుతుందని ఎమ్మెల్సీ కవితపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. కేసులను తప్పు దోవ పట్టించేందుకు నాటకాలు ఆడకు అంటూ మండిపడ్డారు. బీజేపీ ఇచ్చిన హామీలనే మోడీ నెరవేరుస్తున్నారని తెలిపారు. కేసీఆర్, కవితలు మాట్లాడడం విచారకరం అన్నారు. అసెంబ్లీ సీట్లలో మహిళలకు ఎన్ని ఇచ్చారు? అంటూ ప్రశ్నించారు. మహిళ అయిన తన పైన అడ్డగోలుగా మీ నాయన మాట్లాడారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కి మహిళల పట్ల ఉన్న గౌరవం ఇది అంటూ మండిపడ్డారు. మీ నాన్నకి చెప్పు మహిళలను గౌరవించమని అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారం లోకి వస్తుందన్నారు. తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తేనే పేదలతో సహా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మోడీ భారత ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటుతుంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతుందని అన్నారు.
Read also: Health Tips : మీరు రోజూ చాక్లేట్ తింటారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే..
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
దేశంలో మత చిచ్చు, వైసమ్యాలు సృష్టిస్తుంది కాంగ్రెస్ అంటూ మండిపడ్డారు. సనాతన ధర్మం లేకుండా చేయాలని కాంగ్రెస్ చూస్తుందన్నారు. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజల్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారని తెలిపారు. కర్ణాటకలో 4 వేల పెన్షన్ ఇస్తున్నారా? అంటూ మండిపడ్డారు. అభివృద్దికి నిధులు ఉండవని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అధికారం కోసమే కాంగ్రెస్ హామీలు… అమలు కోసం కాదని మండిపడ్డారు. దేశం కోసం, రాష్ట్రం కోసం ఎప్పుడైనా ఆలోచన చేశారా? వాళ్ళు మూడు గ్యారంటీలు ఇవ్వాలన్నారు. మా ఎమ్మేల్యేలు పార్టీ మారారని అన్నారు. అధికారంలోకి వస్తే స్కాం లు ఉండవన్నారు. తెలంగాణ చరిత్రను తప్పి దారి పట్టించమని గ్యారంటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశం, రాష్ట్రాల అభివృద్ది ధ్యేయంగా బీజేపీ, మోడీ ప్రభుత్వం పథకాలు తీసుకొస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల నెరవేరే విధంగా బీజేపీ మేనిఫెస్టో ఉంటుందన్నారు.
Bigg Boss Telugu 7: నామినేషన్స్ లో టాప్ కంటెస్టెంట్స్.. ఈ వారం వెళ్ళేది?
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!