Telangana : ప్రైవేట్ కాలేజీల బంద్ అలర్ట్.. నవంబర్ 3 నుంచి నిరవధిక సమ్మె
- ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విద్యా రంగం దెబ్బతింటోందని ఆరోపణ
- నవంబర్ 3 నుంచి అన్ని వృత్తి విద్యా కాలేజీలు బంద్ నిర్ణయం
- 10 లక్షల విద్యార్థులతో బహిరంగ సభ సిద్ధం చేస్తున్న యాజమాన్యాలు
- బకాయిలు విడుదల చేయాలని సర్కార్పై అల్టిమేటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలోని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బకాయిలు విడుదల చేయకపోవడంతో నవంబర్ 3 నుంచి అన్ని వృత్తి విద్యా కాలేజీలు నిరవధిక బంద్లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల ఛైర్మన్ రమేష్ బాబు మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపి 1,200 కోట్ల రూపాయలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. “మిగతా మొత్తానికి ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని, ఒక రోడ్మ్యాప్ రూపొందించాలని చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. డిప్యూటీ సీఎంతో సహా అందరినీ కలిసాం, కానీ కేవలం 300 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మిగిలిన 900 కోట్లు దీపావళి వరకు ఇవ్వాలని అడిగినా స్పందన లేదు. నవంబర్ 1 నాటికి పెండింగ్ బకాయిలు ఇవ్వాలని మేము కోరాం” అని వివరించారు.
అంతేకాకుండా.. “మా మీద ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. విజిలెన్స్ విచారణ పేరుతో మమ్మల్ని వేధిస్తోంది. రాష్ట్రంలోని అన్ని వృత్తి విద్యా కాలేజీలు నవంబర్ 3 నుండి నిరవధిక బంద్ చేస్తున్నాం. ప్రభుత్వం రేపటిలోగా సానుకూల నిర్ణయం తీసుకోవాలి. లేనిపక్షంలో బంద్ తప్పద” అని హెచ్చరించారు. అలాగే బంద్ సమయంలో జరగనున్న పరీక్షలను కూడా వాయిదా వేయాలని కోరారు. “కళాశాలలకు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వానికి ఉన్న ఉద్దేశం ఏమిటో చెప్పాలి. నవంబర్ 6న లక్ష మందితో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. నవంబర్ 10 లేదా 11న పది లక్షల మంది విద్యార్థులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం” అని తెలిపారు.
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
“ఆ కాలేజీలకు లంచం ఇచ్చారా? అనే అంశంపై విచారణ జరపాలి. ఫ్రాడ్ జరిగిన చోటే విచారణ జరగాలి. అవసరమైతే ఎమ్మెల్యేలు, అధికారుల ఇళ్లను ముట్టడిస్తాం. విద్యార్థులకు, తల్లిదండ్రులకు కలిగే అసౌకర్యానికి క్షమాపణలు” అని చెప్పారు. ప్రైవేట్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “సర్కార్ నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి. విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద ఉంచుకోవడంతో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతోంది. విజిలెన్స్ విచారణ పేరుతో బ్లాక్ మెయిల్ రాజకీయాలు జరుగుతున్నాయి. రెండు మూడు రోజుల్లో మా బకాయిలు విడుదల చేయాలి. విద్యార్థి సంఘాలు కూడా మా వెంట ఉద్యమిస్తున్నాయి. విజిలెన్స్ తో బెదిరిస్తే భయపడేది లేదు” అని స్పష్టం చేశారు.
Supreme Court: అది ప్రేమ, కామం కాదు.. “పోక్సో కేసు”లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!