BRS party: బీఆర్ఎస్ పార్టీ పేరు నాకే కేటాయించాలి.. న్యాయపోరాటం తప్పదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చడం లాంఛనమే అంటున్నారు.. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మారుస్తూ దసరా రోజు ఆ పార్టీ నేతలు తీర్మానం చేసిన విషయం తెలిసిందే కాగా.. ఆ తీర్మానం కాపీని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అందజేశారు పార్టీ ప్రతినిధులు.. పార్టీ పేరు మార్పుపై అభ్యంతరాల స్వీకరణకు గడువు ఈ నెల 6వ తేదీతో ముగిసిపోయింది.. దీంతో ఏ క్షణంలోనైనా ఈసీ నుంచి బీఆర్ఎస్ పై ప్రకటన వచ్చే అవకాశం ఉందని పార్టీ అధినేత కేసీఆర్ సహా పార్టీ శ్రేణులంతా ఎదురుచూస్తున్నారు.. ఈ సమయంలో.. అసలు బీఆర్ఎస్ పార్టీకి అనుమతి ఇస్తే ఆదినాకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు వరంగల్ జిల్లా నర్సంపేట్ నియోజకవర్గానికి చెందిన ఓ యువకుడు..
Read Also: RBI: గుడ్న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. వాటికోసం ఇక బ్యాంక్కు వెళ్లాల్సిన అవసరంలేదు..
Also Read
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
- CM Revanth Reddy : RDS నీళ్లపై తెలంగాణ మాస్టర్ ప్లాన్.!
భారతీయ రాష్ట్ర సమితి పార్టీ పేరు తనకు కేటాయించాలని సెప్టెంబర్ 5వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నానని ఆధారాలు చూపుతున్నారు బానోత్ ప్రేమ్ గాంధీ నాయక్ అనే యువకుడు.. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మారుస్తూ ఎప్పుడైనా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోన్న సమయంలో.. అసలు ఆ పేరు నాకే కేటాయించాలని మరోసారి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు.. భారతీయ రాష్ట్ర సమితి పార్టీ పేరు తనకు కేటాయించాలని సెప్టెంబర్లోనే దరఖాస్తు చేశాను.. ఫస్ట్ కమ్ ఫస్ట్ గెట్ ప్రకారం… బీఆర్ఎస్ తనకే ఇవ్వాలంటూ ఈ నెల 6వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.. (ఎఫ్ నంబర్ 56/164/2022/పీ.పీ.ఎస్-4) నెంబర్ కోడ్ లేఖను ఈసీకి పంపారు ప్రేమ్ నాయక్… బీఆర్ఎస్ పార్టీ పేరు గనక తనకు కేటాయించకపోతే న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు ప్రేమ్ నాయక్. మరి, కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ లేఖను పరిగణనలోకి తీసుకుంటుందా? అసలు బీఆర్ఎస్పై ఎప్పుడు ప్రకటన చేస్తుంది. అనేది ఉత్కంఠగా మారింది.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!