RBI: గుడ్న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. వాటికోసం ఇక బ్యాంక్కు వెళ్లాల్సిన అవసరంలేదు..
వడ్డీ రేట్లను పెంచుతూ షాకిచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ఇదే సమయంలో ఓ గుడ్న్యూస్ కూడా చెప్పింది.. ఆన్లైన్ కేవైసీ వెరిఫికేషన్ పూర్తిచేసే బ్యాంకు కస్టమర్లు వార్షికంగా తమ వ్య క్తిగత వివరాల్లోమార్పులేమైనా ఉంటే వాటిని కూడా ఆన్లైన్లోనే ఆప్డేట్ చేసుకోవచ్చని తెలిపిందే.. e-KYC చేస్తే బ్యాంకులు బ్రాంచ్ స్థాయిలో వెరిఫికేషన్ అడగకూడదని స్పష్టం చేసింది.. ఒక కస్టమర్ ఈ-కేవైసీ చేసినట్లయితే లేదా సీ-కేవైసీ పోర్టల్లో కేవైసీ ప్రక్రియను పూర్తి చేసినట్లయితే, బ్యాంకులు శాఖ స్థాయిలో ధృవీకరణలు/అప్డేట్లను అడగకూడదని పేర్కొంది.. ఆన్లైన్లో తమ KYC ధృవీకరణలను పూర్తి చేసిన బ్యాంక్ కస్టమర్లు వార్షిక అప్డేట్లను అలాగే ఆన్లైన్లో వారి వ్యక్తిగత వివరాలలో ఏవైనా మార్పులు ఉంటే చేయవచ్చు.. కానీ, ధృవీకరణ/అప్డేట్ల కోసం సంబంధిత బ్యాంక్ బ్రాంచ్కి కస్టమర్ రావాల్సిందేననే డిమాండ్ చేయకూడదని.. దీనిపై రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎలాంటి నిబంధన లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు..
Read Also: World Richest Person: ప్రపంచ కుబేరులు.. ఫస్ట్ ప్లేస్ కోల్పోయిన ఎలాన్ మస్క్.. వివరాలు ఇవిగో..
Also Read
- Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?
- Elon Musk: ఎలాన్ మస్క్ నిమిషానికి, గంటకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే.. షాకవ్వాల్సిందే!
- Business In Postal: నిరుద్యోగులకు మంచి బిజినెస్ అవకాశం కల్పిస్తోన్న పోస్టల్ శాఖ.. దరఖాస్తులు ఆహ్వానం..
- Manappuram: నిబంధనలు ఉల్లంఘించిన మణప్పురం ఫైనాన్స్.. ఆగ్రహం వ్యక్తం చేసిన సెబీ..
అలాగే సెంట్రల్-కేవైసీ (సి-కెవైసి) పోర్టల్లో తమ కేవైసీ వివరాలను అప్లోడ్ చేసిన కస్టమర్లను ఏ బ్యాంకు వెరిఫికేషన్ కోసం అడగకూడదని కూడా గవర్నర్ స్పష్టం చేశారు.. అటువంటి సందర్భంలో, సీ-కేవైసీ పోర్టల్ నుండి కేవైసీ వివరాలను యాక్సెస్ చేయడానికి కస్టమర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ నుండి బ్యాంక్కి మెయిల్ లేదా మెసేజ్ చేయవచ్చు అని సూచించారు.. ఈ విషయంలో బ్యాంకులకు అవగాహనలేకపోవడంపై తప్పుబట్టారు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రబీ శంకర్.. అటువంటి వివరాలతో కస్టమర్లను ఇబ్బంది పెట్టవద్దని సెంట్రల్ బ్యాంక్ క్రమం తప్పకుండా బ్యాంకులను కోరుతుందనిన్నారు.. బహుశా నిబంధనలపై అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి విషయాలు ఉత్పన్నమవుతాయని, బాధిత ఖాతాదారుడు ఎవరైనా దీని గురించి బ్యాంకింగ్ అంబుడ్స్మన్ను సంప్రదించవచ్చు అని చెప్పారు.
తాజావార్తలు
-
IPL Historic Day: బ్యాట్స్మెన్ల మెరుపులు, భారీ స్కోర్లు, రికార్డు ఛేజింగ్లు.. ఐపీఎల్ చరిత్రలో చారిత్రాత్మక రోజు!
-
Gayapadda Simham: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’లో శ్రీ విష్ణు మేజిక్..
-
New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
-
Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
-
న్యూ లుక్లో YS Jagan.. యూరప్ టూర్కు బయల్దేరిన మాజీ సీఎం.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!