Power Cuts in Hyderabad: హైదరాబాద్ లో విద్యుత్ కోతలు.. నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Power Cuts in Hyderabad: హైదరాబాద్ వాసులకు విద్యుత్ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. నగరంలో నేటి నుంచి కరెంట్ కోతలు అమల్లోకి రానున్నాయని ప్రకటించారు. వార్షిక నిర్వహణ, మరమ్మత్తు పనుల్లో భాగంగా ఈ కోతలను అమలు చేస్తున్నట్లు TSSAPDCL MD ముషారఫ్ అలీ ఫరూఖీ తన (ఎక్స్) వేదికగా వెల్లడించారు. ఈ కరెంటు కోతల వల్ల ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు. నేటి (17) నుంచి ఫిబ్రవరి 10 వరకు కరెంటు కోతలు ఉంటాయని తెలిపారు. వేసవి/రబీ సీజన్లో అధిక విద్యుత్ డిమాండ్కు సిద్ధం కావడానికి వార్షిక నిర్వహణలో భాగంగా రెండు గంటల వరకు విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు. నిర్వహణ పనుల్లో భాగంగా విద్యుత్ లైన్లపై పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్ లైన్లను పరిశీలించి అవసరమైతే కొత్తవి వేస్తామని ముషారఫ్ తెలిపారు. కరెంటు కోతలు ఉంటాయని, రోజూ కాదని, ఒక్కో ఫీడర్కు ఒక రోజు మాత్రమేనని తెలిపారు.
Read also: JaggaReddy: ఎమ్మెల్సీ అభ్యర్డుల బీఫార్మ్ లపై సంతకం చేసిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
Also Read
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 3 వేల బేసి ఫీడర్లు ఉన్నాయని.. నేటి (జనవరి 17) నుంచి 2024 ఫిబ్రవరి 10 వరకు (ఆదివారాలు & పండుగలు మినహా) 15 నిమిషాల నుంచి 2 గంటల వరకు విద్యుత్ను నిలిపివేసి నిర్వహణ పనులు పూర్తి చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. నిర్వహణ పనులు జరిగే ప్రాంతాల్లోనే కరెంటు కోతలు ఉంటాయన్నారు. విద్యుత్తు అంతరాయాలకు సంబంధించిన వివరాలు http://tssouthernpower.com వెబ్సైట్లో అప్లోడ్ చేయబడతాయని తెలిపారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ కోతలు తప్పవని బీఆర్ఎస్ విమర్శించిన విషయం తెలిసిందే. మళ్లీ చీకటి రోజులు వస్తాయని హెచ్చరించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్ విద్యుత్ పై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. విద్యుత్ సంస్థలు దాదాపు 80,000 కోట్ల మేర నష్టపోతున్నాయని BRS ప్రభుత్వం ఆరోపించింది. ఈ నేపథ్యంలో మెయింటెనెన్స్ పేరుతో కరెంటు కోతలకు సిద్ధమవుతుండటంతో ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.
Prabhas: అనౌన్స్మెంట్ లుక్ లోకి వచ్చేసాడు… పార్ట్ 2 మొదలుపెడుతున్నారా?
తాజావార్తలు
-
Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
-
Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-
Janhvi Kapoor: కోలీవుడ్లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!