JaggaReddy: ఎమ్మెల్సీ అభ్యర్డుల బీఫార్మ్ లపై సంతకం చేసిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JaggaReddy: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ రేపటితో (18) ముగియనుంది. రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ పేర్లను ప్రకటించింది. వారికి ఇచ్చిన ఫారాలపై వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంతకం చేశారు. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నందున జగ్గారెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించారు.
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగరావు పేరు తెరపైకి వచ్చింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేరు దాదాపు ఖరారైందని ప్రచారం జరిగినా.. నిన్న (మంగళవారం) మాత్రం అనూహ్యంగా వెంకట్ రేసులోకి దిగారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్తో పాటు వెంకట్ను రెండో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. దీనికి సంబంధించి నిన్న మధ్యాహ్నం నుంచి ప్రచారం జరిగినా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే వారిద్దరికీ ఏఐసీసీ నుంచి వ్యక్తిగత సమాచారం అందిందని, నామినేషన్లు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ నెల 18న నామినేషన్లు దాఖలు చేయనున్న నేపథ్యంలో ఏ క్షణమైనా ఏఐసీసీ ఈ ఇద్దరి పేర్లను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మంగళవారం నాడు ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆలస్యమైందని, బుధవారం అధికారిక ప్రకటన వెలువడుతుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
Read also: Konaseema Coconut Bonds: నేడు అయోధ్యకు మండపేట ‘కల్యాణ’ కొబ్బరి బోండాలు
జగ్గారెడ్డికి బి ఫారంలపై సంతకం అధికారం..
నామినేషన్ల దాఖలు, ఎమ్మెల్యేల ప్రతిపాదిత సంతకాల వ్యవహారాలను సమన్వయం చేసే బాధ్యతలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించినట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం ఎన్నుకున్న తర్వాత అత్యంత చిన్న వయస్సున్న అభ్యర్థిగా బల్మూరి వెంకట్ రికార్డు సృష్టించనున్నారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడిగా శాసనమండలికి ఎన్నికైన వ్యక్తిగా గుర్తింపు పొందనున్నారు. ప్రస్తుతం వెంకట్ వయసు 30 ఏళ్ల 9 నెలలు. ఇప్పటివరకు, అతను 33 సంవత్సరాల వయస్సులో గుజరాత్ శాసనమండలికి ఎన్నికయ్యాడు, ఇప్పుడు వెంకట్ ఆ రికార్డును అధిగమిస్తాడని గం«దీభవన్ వర్గాలు తెలిపాయి.
Health Tips : చలికాలంలో లవంగాలు తింటే ఏమౌతుందో తెలుసా?
తాజావార్తలు
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!