JaggaReddy: ఎమ్మెల్సీ అభ్యర్డుల బీఫార్మ్ లపై సంతకం చేసిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JaggaReddy: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ రేపటితో (18) ముగియనుంది. రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ పేర్లను ప్రకటించింది. వారికి ఇచ్చిన ఫారాలపై వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంతకం చేశారు. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నందున జగ్గారెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించారు.
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగరావు పేరు తెరపైకి వచ్చింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేరు దాదాపు ఖరారైందని ప్రచారం జరిగినా.. నిన్న (మంగళవారం) మాత్రం అనూహ్యంగా వెంకట్ రేసులోకి దిగారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్తో పాటు వెంకట్ను రెండో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. దీనికి సంబంధించి నిన్న మధ్యాహ్నం నుంచి ప్రచారం జరిగినా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే వారిద్దరికీ ఏఐసీసీ నుంచి వ్యక్తిగత సమాచారం అందిందని, నామినేషన్లు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ నెల 18న నామినేషన్లు దాఖలు చేయనున్న నేపథ్యంలో ఏ క్షణమైనా ఏఐసీసీ ఈ ఇద్దరి పేర్లను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మంగళవారం నాడు ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆలస్యమైందని, బుధవారం అధికారిక ప్రకటన వెలువడుతుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
Read also: Konaseema Coconut Bonds: నేడు అయోధ్యకు మండపేట ‘కల్యాణ’ కొబ్బరి బోండాలు
జగ్గారెడ్డికి బి ఫారంలపై సంతకం అధికారం..
నామినేషన్ల దాఖలు, ఎమ్మెల్యేల ప్రతిపాదిత సంతకాల వ్యవహారాలను సమన్వయం చేసే బాధ్యతలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించినట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం ఎన్నుకున్న తర్వాత అత్యంత చిన్న వయస్సున్న అభ్యర్థిగా బల్మూరి వెంకట్ రికార్డు సృష్టించనున్నారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడిగా శాసనమండలికి ఎన్నికైన వ్యక్తిగా గుర్తింపు పొందనున్నారు. ప్రస్తుతం వెంకట్ వయసు 30 ఏళ్ల 9 నెలలు. ఇప్పటివరకు, అతను 33 సంవత్సరాల వయస్సులో గుజరాత్ శాసనమండలికి ఎన్నికయ్యాడు, ఇప్పుడు వెంకట్ ఆ రికార్డును అధిగమిస్తాడని గం«దీభవన్ వర్గాలు తెలిపాయి.
Health Tips : చలికాలంలో లవంగాలు తింటే ఏమౌతుందో తెలుసా?
తాజావార్తలు
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..