Group 2 Exam: జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలు వాయిదా ! మళ్లీ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group 2 Exam: తెలంగాణ గ్రూప్-2 పరీక్ష వాయిదా పడే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహించాల్సి ఉండగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం పరీక్ష నిర్వహణకు ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీనికి కారణాలేమిటంటే… ఇటీవల చైర్మన్ జనార్థన్ రెడ్డితోపాటు పలువురు సభ్యులు రాజీనామా చేశారు. దీంతో గ్రూప్ 2 పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు పరీక్షల తేదీలు దగ్గరపడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఏర్పాట్లకు సంబంధించి కమిషన్ నుండి ఎటువంటి అప్డేట్ రాలేదు. దీంతో పరీక్ష మరోసారి వాయిదా పడే అవకాశాలే ఎక్కువ. గతేడాది TSPSC 783 పోస్టులతో గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. జనవరి 18 నుండి ఫిబ్రవరి 16, 2023 వరకు స్వీకరించిన దరఖాస్తులు. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-2 పరీక్షను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహిస్తామని తొలుత ప్రకటించింది. గ్రూప్-1, 4 పరీక్షలకు, గురుకుల రిక్రూట్మెంట్ పరీక్షలకు పూర్తిగా సిద్ధమయ్యే సమయం లేనందున గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
Read also: IPL 2024: అప్పుడు క్రికెట్ కిట్ కొనే పరిస్థితి కూడా లేదు.. ఇప్పుడు ఇళ్లు కొంటా: దూబె
Also Read
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
దీనికి సంబంధించి, కమిషన్ నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. అయితే, నవంబర్ 3 నుండి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో, కమిషన్ ఈ పరీక్షలను మళ్లీ జనవరి 6 మరియు 7, 2024, TSPSCకి రీషెడ్యూల్ చేసింది. కాగా, పేపర్ లీక్ కేసుపై రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేయాలని భావించిన సర్కార్.. చైర్మన్, సభ్యుల రాజీనామా దిశగా అడుగులు వేసింది. సర్కార్ ప్రయత్నాల నేపథ్యంలో… కమిషన్ సభ్యులు కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం కమిషన్లో చైర్మన్తో పాటు సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వారి పేర్లను ఖరారు చేసి గవర్నర్కు పంపాల్సి ఉంటుంది. వీరి నియామకాలకు రాష్ట్రపతి ఆమోదం కూడా తప్పనిసరి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పట్టవచ్చు. కొత్త కమిషన్ ఏర్పాటైన తర్వాత గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
IPL 2024: అప్పుడు క్రికెట్ కిట్ కొనే పరిస్థితి కూడా లేదు.. ఇప్పుడు ఇళ్లు కొంటా: దూబె
తాజావార్తలు
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..