Group 2 Exam: జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలు వాయిదా ! మళ్లీ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group 2 Exam: తెలంగాణ గ్రూప్-2 పరీక్ష వాయిదా పడే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో పరీక్ష నిర్వహించాల్సి ఉండగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం పరీక్ష నిర్వహణకు ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీనికి కారణాలేమిటంటే… ఇటీవల చైర్మన్ జనార్థన్ రెడ్డితోపాటు పలువురు సభ్యులు రాజీనామా చేశారు. దీంతో గ్రూప్ 2 పరీక్షపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు పరీక్షల తేదీలు దగ్గరపడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఏర్పాట్లకు సంబంధించి కమిషన్ నుండి ఎటువంటి అప్డేట్ రాలేదు. దీంతో పరీక్ష మరోసారి వాయిదా పడే అవకాశాలే ఎక్కువ. గతేడాది TSPSC 783 పోస్టులతో గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. జనవరి 18 నుండి ఫిబ్రవరి 16, 2023 వరకు స్వీకరించిన దరఖాస్తులు. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-2 పరీక్షను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహిస్తామని తొలుత ప్రకటించింది. గ్రూప్-1, 4 పరీక్షలకు, గురుకుల రిక్రూట్మెంట్ పరీక్షలకు పూర్తిగా సిద్ధమయ్యే సమయం లేనందున గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
Read also: IPL 2024: అప్పుడు క్రికెట్ కిట్ కొనే పరిస్థితి కూడా లేదు.. ఇప్పుడు ఇళ్లు కొంటా: దూబె
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
దీనికి సంబంధించి, కమిషన్ నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. అయితే, నవంబర్ 3 నుండి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో, కమిషన్ ఈ పరీక్షలను మళ్లీ జనవరి 6 మరియు 7, 2024, TSPSCకి రీషెడ్యూల్ చేసింది. కాగా, పేపర్ లీక్ కేసుపై రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేయాలని భావించిన సర్కార్.. చైర్మన్, సభ్యుల రాజీనామా దిశగా అడుగులు వేసింది. సర్కార్ ప్రయత్నాల నేపథ్యంలో… కమిషన్ సభ్యులు కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం కమిషన్లో చైర్మన్తో పాటు సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వారి పేర్లను ఖరారు చేసి గవర్నర్కు పంపాల్సి ఉంటుంది. వీరి నియామకాలకు రాష్ట్రపతి ఆమోదం కూడా తప్పనిసరి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పట్టవచ్చు. కొత్త కమిషన్ ఏర్పాటైన తర్వాత గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
IPL 2024: అప్పుడు క్రికెట్ కిట్ కొనే పరిస్థితి కూడా లేదు.. ఇప్పుడు ఇళ్లు కొంటా: దూబె
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!