Ponguleti Sudhakar Reddy: ఖమ్మంలో 16న వనభోజనాలు.. 29న సేవా సుపరిపాలన సభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Sudhakar Reddy: ఖమ్మంలో ఈనెల 16న సామూహిక వనభోజనాలు, రాష్ట్ర వ్యాపితంగా ఆత్మీయ కలయిక నిర్వహస్తున్నామని, 29న సేవా-సుపరిపాలన సభ జరగబోతుందని బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కిలాడి రాజకీయ క్రీడా మొదలైందన్నారు. కిలాడి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కిలాడి రాజకీయాలు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. పిట్టలదొర మాటలతో ప్రజలని గాలికి వదిలేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగారు తెలంగాణ పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్నారని అన్నారు. తెరవెనుక, తెరముందు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ను ముందు పెట్టి బీజేపీని బదనాం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పార్టీగా,స్కామ్ లేని, స్కీం ఉన్న పార్టీగా బీజేపీ ఉందన్నారు. బీజేపీ పై విషం కక్కుతున్నారని అన్నారు. అసలు రాష్ట్రంలో కోర్టులకు విలువ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టుకోవాలో తేల్చుకోలేక చస్తున్నారి తీవ్రంగా మండాపడ్డారు. రాష్ట్రంలో రైతు రుణ మాఫీ ఊసే లేదన్నారు. అకౌంట్ లన్నీ ఫ్రీజ్ చేస్తున్నారు బ్యాంక్ వాళ్ళు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలపై పర్యవేక్షణ లేదన్నారు. దళిత బంద్ లేనే లేదని, బీఆర్ఎస్ దళిత బందా?..
దళిత బంధా చెప్పాలని వ్యంగాస్త్రం వేశారు. ఎరువులకు కేంద్రం రాయితీ ఇస్తున్నా అది ప్రజలకు తెలియనీయకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
Read also: WHO: కూల్ డ్రింక్స్లో కేన్సర్ కారకం.. WHO కీలక ప్రకటన
Also Read
- Konda Murali : కాంగ్రెస్ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
- Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
ముద్ర లోన్లు లేవని, జిల్లా మంత్రి మాటలకు చేతలకు పొంతన లేదన్నారు. మీ సొంత ఆస్తి కాదు కదా? అని ప్రశ్నించారు. కార్మికులను రెగ్యులర్ చేయరని, కేసీఆర్ కిట్లతో మసి పూసి మారేడు కాయ చేస్తున్నారని మండిపడ్డారు. గంజాయికి పెట్టింది పేరుగా ఖమ్మం పరాకాష్టకు చేరిందని అన్నారు. ప్రజలు రాత్రి బయటకు రావడానికి భయపడుతున్నారని అన్నారు. ఏటీఎం లాగా గంజాయి పాయింట్లు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వాళ్లే పెంచిపోషిస్తున్నారని అన్నారు. ఇసుక మాఫియా కొనసాగుతుందని అన్నారు. పోలీసులు ప్రజల పక్షాన ఉండాల్సింది పాలకులకు వంత పాడుతున్నారని మండిపడ్డారు. ఖమ్మంలో క్రైమ్ విచ్చలవిడి అయిపోయిందని అన్నారు. మొన్న జరిగిన పవన్ సాయి హత్య కేసులో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా గంజాయిని జిల్లా నుంచి తరిమికొట్టాలని కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు చేతకాకపోతే మేమే చెక్ పోస్టులు పెట్టుకుంటామని అన్నారు. 6 నెలలుగా విన్నవించినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఈనెల 16న సామూహిక వనభోజనాలు.. రాష్ట్ర వ్యాపితంగా ఆత్మీయ కలయిక నిర్వహస్తున్నామన్నారు. డబుల్ బెడ్రూం, రేషన్ కార్డు, బీఆర్ఎస్ ఇవ్వని మోసాలపై త్వరలో కార్యక్రమం తీసుకుంటామన్నారు.
WHO: కూల్ డ్రింక్స్లో కేన్సర్ కారకం.. WHO కీలక ప్రకటన
తాజావార్తలు
-
Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
-
Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
-
Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్తో లక్షలు!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..