Ganja Selling: వీళ్లు అత్తాకోడళ్ళా.. యవ్వారం మమూలుగా లేదుగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganja Selling: ఈ అత్తకోడళ్ల రోజువారీ సంపాదన రూ.30 వేలు. నెలకు రూ. 9 లక్షలు. వాళ్లు చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఉన్నత స్థాయి వ్యాపారం కాదు. పక్కాగా చెప్పాలంటే చీకటి దండా.. వీరిద్దిర యవ్వారం మామూలుగా లేదంటారా? వీరద్దరే కాదండోయ్ కుటుంబమంతా అక్రమ వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదిస్తోందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అసలు ఈ అత్తాకోడళ్లు ఏం చేస్తున్నారంటే.. అక్రమంగా గంజాయిని విక్రయించి భారీగా ఆస్తులు సంపాదించారన్న మాట. ఎంతదాచిన దొంగ దొరక్కుండ ఉంటాడా.. చివరికి ఈ అత్తాకోడళ్ల భాగోతం బట్టబయలు కావడంతో కటకటాల వెనక్కొ వెళ్లాల్సి వచ్చింది. ఇదంతా ఎక్కడో కాదండోయ్ హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో చోటుచేసుకుంది.
Read also: Top Headlines @1PM : టాప్ న్యూస్
Also Read
- AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
- Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్పైనే ఆశలు!
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
నానక్రామ్గూడ లోధా బస్తీకి చెందిన కాళపాటి గౌతమ్సింగ్, అతని తల్లి కాలాపాటి నీతూభాయ్, అతని కుటుంబానికి చెందిన మరో ఆరుగురు మధుబాయి కొన్నేళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తున్నారు. నీతూభాయ్ కుటుంబ సభ్యులు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉంటూ ఈ గంజాయి దందా చేస్తున్నారు. ధూల్పేటలో రూ. కిలో 8 వేలు.. 5 గ్రాముల ప్యాకెట్లను తయారు చేసి ఒక్కొక్కటి రూ. 250కి విక్రయిస్తున్నారు. ఇలా.. ఒక కేజీపై రూ. 50 వేలకు పైగానే ఈ ముఠా సంపాదిస్తోంది. నీతూబాయి , ఆమె కోడలు మధుబాయి కనీసం రూ. 30 వేల వరకు నెలకు రూ. 9 లక్షలు సంపాదించినట్లు పోలీసుల విచారణలో తేలింది. గంజాయి దందా ద్వారా వచ్చిన డబ్బుతో రూ. 4 కోట్ల ఆస్తులు కూడబెట్టారు. నీతూబాయి లంగర్హౌస్, గచ్చిబౌలి ప్రాంతాల్లో మూడంతస్తుల భవనాలు, ఖరీదైన కార్లను కొనుగోలు చేసింది. మంగళవారం బాలుడితో పాటు గౌతమ్సింగ్ అనే వ్యక్తి గంజాయితో ప్రయాణిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో గోల్కొండ పోలీసులతో పాటు నార్కోటిక్స్ బ్యూరో సిబ్బంది అతడిని పట్టుకున్నారు. ఈ ఇద్దరిని విచారించగా నీతూభాయ్, మధుబాయిల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నీతుబాయి వద్ద రూ. 40.30 లక్షలు, 16 బ్యాంకు ఖాతాల్లోని రూ.1.53 కోట్ల నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఎన్డీపీఎస్ చట్టం కింద నీతూభాయ్పై పలు కేసులు నమోదు కాగా, ఆమెపై పీడీ యాక్ట్ కూడా ఉంది. ఆమె కొడుకుపై కూడా కేసులు ఉన్నాయి. అయినప్పటికీ, మార్గం మార్చుకోకుండా, కుటుంబం కలిసి కొన్నేళ్లుగా గంజాయి వ్యవహరం కొనసాగిస్తోంది.
Miyapur Firing: కక్షతోనే దేవేందర్ పై రితీష్ కాల్పులు.. గొడవకు కారణమైన ఆమె ఎవరు..?
తాజావార్తలు
-
Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
-
Imran Khan Gets Relief: ఇమ్రాన్ ఖాన్కు పాక్ కోర్టులో భారీ ఊరట..
-
Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంట్లో విషాదం.. మేనకోడలు ఆత్మహత్య
-
Supreme Court: CJP నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
-
AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!