Ganja Selling: వీళ్లు అత్తాకోడళ్ళా.. యవ్వారం మమూలుగా లేదుగా..!
Ganja Selling: ఈ అత్తకోడళ్ల రోజువారీ సంపాదన రూ.30 వేలు. నెలకు రూ. 9 లక్షలు. వాళ్లు చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఉన్నత స్థాయి వ్యాపారం కాదు. పక్కాగా చెప్పాలంటే చీకటి దండా.. వీరిద్దిర యవ్వారం మామూలుగా లేదంటారా? వీరద్దరే కాదండోయ్ కుటుంబమంతా అక్రమ వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదిస్తోందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అసలు ఈ అత్తాకోడళ్లు ఏం చేస్తున్నారంటే.. అక్రమంగా గంజాయిని విక్రయించి భారీగా ఆస్తులు సంపాదించారన్న మాట. ఎంతదాచిన దొంగ దొరక్కుండ ఉంటాడా.. చివరికి ఈ అత్తాకోడళ్ల భాగోతం బట్టబయలు కావడంతో కటకటాల వెనక్కొ వెళ్లాల్సి వచ్చింది. ఇదంతా ఎక్కడో కాదండోయ్ హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో చోటుచేసుకుంది.
Read also: Top Headlines @1PM : టాప్ న్యూస్
Also Read
- Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
నానక్రామ్గూడ లోధా బస్తీకి చెందిన కాళపాటి గౌతమ్సింగ్, అతని తల్లి కాలాపాటి నీతూభాయ్, అతని కుటుంబానికి చెందిన మరో ఆరుగురు మధుబాయి కొన్నేళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తున్నారు. నీతూభాయ్ కుటుంబ సభ్యులు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉంటూ ఈ గంజాయి దందా చేస్తున్నారు. ధూల్పేటలో రూ. కిలో 8 వేలు.. 5 గ్రాముల ప్యాకెట్లను తయారు చేసి ఒక్కొక్కటి రూ. 250కి విక్రయిస్తున్నారు. ఇలా.. ఒక కేజీపై రూ. 50 వేలకు పైగానే ఈ ముఠా సంపాదిస్తోంది. నీతూబాయి , ఆమె కోడలు మధుబాయి కనీసం రూ. 30 వేల వరకు నెలకు రూ. 9 లక్షలు సంపాదించినట్లు పోలీసుల విచారణలో తేలింది. గంజాయి దందా ద్వారా వచ్చిన డబ్బుతో రూ. 4 కోట్ల ఆస్తులు కూడబెట్టారు. నీతూబాయి లంగర్హౌస్, గచ్చిబౌలి ప్రాంతాల్లో మూడంతస్తుల భవనాలు, ఖరీదైన కార్లను కొనుగోలు చేసింది. మంగళవారం బాలుడితో పాటు గౌతమ్సింగ్ అనే వ్యక్తి గంజాయితో ప్రయాణిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో గోల్కొండ పోలీసులతో పాటు నార్కోటిక్స్ బ్యూరో సిబ్బంది అతడిని పట్టుకున్నారు. ఈ ఇద్దరిని విచారించగా నీతూభాయ్, మధుబాయిల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నీతుబాయి వద్ద రూ. 40.30 లక్షలు, 16 బ్యాంకు ఖాతాల్లోని రూ.1.53 కోట్ల నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఎన్డీపీఎస్ చట్టం కింద నీతూభాయ్పై పలు కేసులు నమోదు కాగా, ఆమెపై పీడీ యాక్ట్ కూడా ఉంది. ఆమె కొడుకుపై కూడా కేసులు ఉన్నాయి. అయినప్పటికీ, మార్గం మార్చుకోకుండా, కుటుంబం కలిసి కొన్నేళ్లుగా గంజాయి వ్యవహరం కొనసాగిస్తోంది.
Miyapur Firing: కక్షతోనే దేవేందర్ పై రితీష్ కాల్పులు.. గొడవకు కారణమైన ఆమె ఎవరు..?
తాజావార్తలు
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
-
Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
-
Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
-
Ravibabu : డబ్బు, టైం ఉంటే ఏ వెధవైనా సినిమా అద్భుతంగా చేస్తాడు.. రవిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో