Pocharam Srinivas : ఆపత్కాల సమయంలో డాక్టర్స్, స్టాఫ్ నర్స్లో సేవలు వెలకట్టలేనిది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణ బిల్లుతో రోగులపైన అధిక ఫీజుల, భారం మోపకుండా సేవ చేయాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మాదాపూర్ లో మెడికవర్ హాస్పిటల్ 25వ శాఖను ఆయన ప్రారంభిస్తూ మాట్లాడారు.. ఆపత్కాల సమయంలో క్టర్స్, స్టాఫ్ నర్స్ లో సేవలు వెలకట్టలేనివని, కరోనా విపత్కర పరిస్థితిలో సాహసోపేతమైన విధులు నిర్వహించారని స్పీకర్ వారిని కొనియాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఆరోగ్య రాష్ట్ర తెలంగాణగా మార్చనున్నారని, ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పటివరకు 20,000 బెడ్స్ సామర్థ్యం నుంచి 50 వేల బెడ్స్ సామర్థ్యానికి పెంచబోతున్నారని, రాష్ట్రంలోని నిమ్స్ హాస్పిటల్ 4000 పడకల ఆసుపత్రిగా త్వరలోనే రూపుదిద్దుకోనున్నదని ఆయన అన్నారు.
Also Read : Success Story : పూల సాగు తో ప్రతినెల 70వేల ఆదాయాన్ని పొందుతున్న రైతు..
Also Read
తెలంగాణలోని మెడికల్ విద్యను అభ్యసించడం కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్లే వాళ్లని రాష్ట్రంలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ లను మంజూరు చేయడం వలన విద్యార్థుల వలసలు తగ్గాయని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు అడగకుండానే అనేక పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజలకు సుపరిపాలన అందించే ప్రభుత్వాలను ప్రజలు ఆదరించాలని స్పీకర్ పోచారం కోరారు. ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ నగర కమిషనర్ సీవీ ఆనంద్, ఆర్టీసీ చైర్మన్ సజ్జనర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : Nithin : వకీల్ సాబ్ దర్శకుడితో సినిమా చేయబోతున్న నితిన్…?
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!