Mudragada Padmanabham: సీఎ చంద్రబాబు, మంత్రి లోకేష్కి ముద్రగడ లేఖ.. కాపులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..!
- సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖ..
- చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు..
- కాపు కులాన్ని రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టు బట్టలతో పంపించండి అంటూ ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mudragada Padmanabham: సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్కు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి (ముద్రగడ పద్మనాభం) ఘాటు లేఖ రాశారు. చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాపు సమాజంపై జరుగుతున్న చర్యలు తీవ్ర అన్యాయమని లేఖలో పేర్కొన్నారు. కాపు కులాన్ని రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టు బట్టలతో పంపించాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ ముద్రగడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తన కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి రాంబాబు కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
Read Also: Pakistan vs ICC: భారత్ మ్యాచ్కే బాయ్కాట్ ఎందుకు?.. పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిపై ఐసీసీ ఫైర్
Also Read
ఇక, కాపు కులం చంద్రబాబుపై కోపంగా ఉన్నప్పటికీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పట్ల ఉన్న ప్రేమతోనే టీడీపీకి మద్దతు ఇచ్చిందన్నది తన అభిప్రాయమని ముద్రగడ లేఖలో తెలిపారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో పార్టీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారని, అయితే పవన్ కల్యాణ్ మద్దతుతోనే వారు మళ్లీ రోడ్డెక్కారని వ్యాఖ్యానించారు. కాపు కులంపై చంద్రబాబు ఎప్పుడూ రగిలిపోతూనే ఉంటారని ఆరోపించిన ముద్రగడ, ప్రస్తుతం రాష్ట్రంలో గాడి తప్పిన రాక్షస పాలన కొనసాగుతోందని తీవ్ర విమర్శలు చేశారు. ఇది దహన కాండను తలపిస్తోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఆశ్రయించి రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన విధించాలని కోరితే, ప్రతిపక్ష నేతలను జైలులో పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రులను అవమానించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అలాగే తిరుమల లడ్డు విషయంలో ప్రభుత్వం చెప్పిన మాటలు అబద్ధమని తేలిందని, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కాపు అంశాన్ని హాట్టాపిక్గా మార్చింది.
తాజావార్తలు
-
Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
-
K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
-
Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. ‘మాపై చేయి వేస్తే.. అణు విలయమే!’
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..
-
AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!