Mudragada Padmanabham: సీఎ చంద్రబాబు, మంత్రి లోకేష్కి ముద్రగడ లేఖ.. కాపులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..!
- సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖ..
- చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు..
- కాపు కులాన్ని రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టు బట్టలతో పంపించండి అంటూ ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mudragada Padmanabham: సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్కు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి (ముద్రగడ పద్మనాభం) ఘాటు లేఖ రాశారు. చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాపు సమాజంపై జరుగుతున్న చర్యలు తీవ్ర అన్యాయమని లేఖలో పేర్కొన్నారు. కాపు కులాన్ని రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టు బట్టలతో పంపించాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ ముద్రగడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తన కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి రాంబాబు కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
Read Also: Pakistan vs ICC: భారత్ మ్యాచ్కే బాయ్కాట్ ఎందుకు?.. పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిపై ఐసీసీ ఫైర్
Also Read
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
- Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
ఇక, కాపు కులం చంద్రబాబుపై కోపంగా ఉన్నప్పటికీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పట్ల ఉన్న ప్రేమతోనే టీడీపీకి మద్దతు ఇచ్చిందన్నది తన అభిప్రాయమని ముద్రగడ లేఖలో తెలిపారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో పార్టీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారని, అయితే పవన్ కల్యాణ్ మద్దతుతోనే వారు మళ్లీ రోడ్డెక్కారని వ్యాఖ్యానించారు. కాపు కులంపై చంద్రబాబు ఎప్పుడూ రగిలిపోతూనే ఉంటారని ఆరోపించిన ముద్రగడ, ప్రస్తుతం రాష్ట్రంలో గాడి తప్పిన రాక్షస పాలన కొనసాగుతోందని తీవ్ర విమర్శలు చేశారు. ఇది దహన కాండను తలపిస్తోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఆశ్రయించి రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన విధించాలని కోరితే, ప్రతిపక్ష నేతలను జైలులో పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రులను అవమానించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అలాగే తిరుమల లడ్డు విషయంలో ప్రభుత్వం చెప్పిన మాటలు అబద్ధమని తేలిందని, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కాపు అంశాన్ని హాట్టాపిక్గా మార్చింది.
తాజావార్తలు
-
Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
-
Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
-
Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
-
YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
-
Bihar: బీహార్లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!