Pocharam Srinivas Reddy: నిర్మలా సీతారామన్ నాకు అక్కతో సమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pocharam Srinivas Reddy comments on Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై చేసిన విమర్శలు తెలంగాణలో కాకాపుట్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు మంత్రులు సీతారామన్ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. తాజాగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై స్పందించారు. నేను బన్సువాడ ఎమ్మెల్యేగా.. మాజీ మంత్రిగా మీ ముందుకు వచ్చానని.. స్పీకర్ హోదాలో మాట్లాడటం లేదని ఆయన అన్నారు. నిర్మలా సీతారామన్ నాకు అక్కతో సమానం అని ఆయన అన్నారు. మాకు కొత్తగా పథకాలు ఇస్తారేమో అని అనుకున్నానని.. కేంద్రమంత్రి వస్తే వరాలు కురిపిస్తారని అనుకున్నాని ఆయన అన్నారు.
నా నియోజకవర్గంలో మాట్లాడారు కాబట్టి నేను స్పందిస్తున్నానని పోచారం అన్నారు. కోల్డ్ స్టోరేజి కావాలని మంత్రిని కలిశానని.. ఒక్క కోల్డ్ స్టోరేజీ కూడా ఇవ్వలేదని అన్నారు. మా అక్క మా బాన్సువాడను సెలెక్ట్ చేసుకుని వచ్చారని అన్నారు. ప్రజల కోసం మంచి పథకాలను తీసుకురండి మేము హర్షిస్తామని అన్నారు. తమరు వచ్చారు.. ఇంకోసారి కూడా రావాలి.. మాకు వరాలు ఇవ్వాలి.. ఆర్థిక సహాయం చేయాలని నిర్మలా సీతారామన్ ను కోరారు.
Also Read
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
- Hyderabad Pan Masala Raid: హైదరాబాద్లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
Read Also: Brahmastra Pre Release Event: చివరి నిమిషంలో ఈవెంట్ క్యాన్సిల్.. కారణం ఇదే!
నేను పశు సంవర్థక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్సీడీఎస్ ద్వారా అప్పు తెచ్చుకుని గొర్ల కాపారులకు గొర్లను ఇచ్చామని..దీంట్లో కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. చేపల పంపిణీకి కేంద్రం నిధులు ఇస్తుందని మాట్లాడారు.. ఇది కూడా అబద్ధం అని..ఎన్సీడీ అనేది అప్పులు ఇచ్చే సంస్థ అని అన్నారు పోచారం. రైతు ఆత్మహత్యలపై నిర్మలా మాట్లాడారు.. రైతుబంధు పథకం మొదలై, 24 గంటల కరెంట్ ఇస్తున్నామని.. చివరి గింజ వరకు కొంటున్నామని.. తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మహత్యలు తగ్గినయి అని ఆయన అన్నారు. దేశంలో అతి తక్కువ ఆత్మహత్యలు జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని ఆయన అన్నారు.
కౌలు రైతుల గురించి మాట్లాడారు.. కౌలు రైతులు ప్రతీ ఏటా మారుతూ ఉంటారని ఆయన తెలిపారు. ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన కౌలు రైతులకు ఇస్తున్నారా..? అని నిర్మలా సీతారామన్ ను ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం కట్టుకుంది.. నీతి ఆయోగ్ డబ్బులు ఇవ్వాలని చెప్పినా.. కేంద్ర ఇవ్వలేదని అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో మీ వాటి ఉందని.. అంతా మీదే కాదని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆదాయం పెరిగిందని..2022కి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పారని..ఏది అని ప్రశ్నించారు. బియ్యం పథకంలో మొత్తం మీరు ఇవ్వట్లేదని.. దీంట్లో కేంద్రానిది, రాష్ట్రానిది సగం సగం వాటా ఉందని పోచారం అన్నారు. మేము ఎక్కడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకోలేదని.. ఆడపడచు వచ్చిందని గౌరవించాం అని పోచారం అన్నారు.
తాజావార్తలు
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
-
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్కు డబుల్ ప్రొటెక్షన్!
-
Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!