Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Pm Narendra Modi Phone Call To Ys Sharmila

PM Modi Phone Call to YS Sharmila: వైఎస్‌ షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్‌.. ఏం జరుగుతోంది…?

Published Date :December 6, 2022 , 2:09 pm
By Sudhakar Ravula
PM Modi Phone Call to YS Sharmila: వైఎస్‌ షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్‌.. ఏం జరుగుతోంది…?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఇష్యూ హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. వరంగల్‌లో ఆమె యాత్రను అడ్డుకోవడం, దాడి కూడా జరిగిన తర్వాత.. ఒక్కసారిగా వైఎస్‌ షర్మిలపై ఫోకస్‌ పెరిగింది.. వరంగల్‌ ఘటనకు నిరసనగా ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నించిన వైఎస్‌ షర్మిలను కారుతో పాటు పీఎస్‌కు తరలించడం కూడా చర్చగా మారింది.. అరెస్ట్‌లు, బెయిల్‌పై విడుదల కావడం.. ఆ తర్వాత రోజు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలవడం, డీజీపీ మహేందర్‌రెడ్డితో భేటీ.. ఇలా.. వరుసగా వార్తల్లో నిలుస్తూ వచ్చారు.. అయితే, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేయడంతో… అసలు ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలకు తెరపైకి వచ్చాయి..

Read Also: Home Minister Taneti Vanitha: ఏపీలోనే అత్యధికంగా డ్రగ్స్‌ స్వాధీనం.. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం..!

Also Read

  • Mahabubabad: 30 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి
  • Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
  • Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
  • Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్‌-ఎన్యుమ‌రేష‌న్‌ ప్రారంభం..!

అయితే, వైఎస్‌ షర్మిలకు ఫోన్‌ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఆమెను పరామర్శించారని తెలుస్తోంది.. ఇటీవల జరిగిన ఘటనలు, ఆమెపట్ల పోలీసులు వ్యవహరించిన తీరు.. అరెస్ట్, కారులో ఉండగానే క్రేన్‌తో పీఎస్‌కు తరలించడం, పాదయాత్రలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడి తదితర అంశాలపై ఆరా తీసినట్టు సమాచారం.. వైఎస్‌ షర్మిలకు సానుభూతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ.. ఇదే సమయంలో.. అరెస్ట్‌ చేసినా ఏ మాత్రం బెదరకుండా ధైర్యంగా వ్యవహరించారని ఆమెను ప్రశంసించారని ప్రచారం సాగుతోంది.. దాదాపు 10 నిమిషాల పాటు వైఎస్‌ షర్మిలతో ప్రధాని మోడీ మాట్లాడారని చెబుతున్నారంటే.. ఇంకా అనేక విషయాలే చర్చకు వచ్చిఉంటాయి అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది..

వరంగల్‌ ఘటన, అరెస్ట్‌ తర్వాత వైఎస్‌ షర్మిల రాజ్‌భవన్‌కు వెళ్లడం.. గవర్నర్‌ తమిళిసైని కలిసినప్పటి నుంచి ఆమెపై విమర్శలు మొదలయ్యాయి… ఓ వైపు సోషల్‌ మీడియాలో.. మరోవైపు అధికార టీఆర్ఎస్‌ పార్టీ నుంచి షర్మిలను టార్గెట్‌ చేసి విమర్శలు గుప్పించారు.. ఇప్పుడు అర్థమైపోయింది.. షర్మిల ఎవరు వదిలిన బాణమో అంటూ మండిపడ్డారు.. ముమ్మాటికి షర్మిల.. భారతీయ జనతా పార్టీ వదిలిన బాణమే అంటూ ఆరోపణలు గుప్పించారు.. ఇక, పాదయాత్రలో షర్మిలపై జరిగిన దాడి ఘటనపై ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు, ఇతర పార్టీల నేతలకు కూడా స్పందించారు. షర్మిలపై జరిగిన దాడి, పోలీసులు తీరును ఖండించారు. ఇదే సమయంలో.. షర్మిల వ్యవహారంలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను కూడా ఉదాహరణగా చూపుతూ వచ్చారు టీఆర్ఎస్‌ నేతలు.. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్న సమయంలో.. నేరుగా ప్రధాని నరేంద్ర మోడీయే వైఎస్‌ షర్మిలకు ఫోన్‌ చేయడం చర్చగా మారింది.. ఇది పరామర్శల వరకే పరిమితం అయ్యిందా? మోడీ ఫోన్‌ కాల్‌ వెనుక ఇంకా ఏదైనా మతలాబు ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక, తనకు ఫోన్‌ చేసి పరామర్శించిన ప్రధాని మోడీకి వైఎస్‌ షర్మిల ధన్యవాదాలు తెలిపారు.. ప్రధాని ఫోన్ చేసిన విషయంపై ఆమె స్పందిస్తూ.. థ్యాంక్యూ మోదీ జీ.. ఒక మోడీ మాత్రమే కాదు ఎంతో మంది స్పందించారని చెప్పుకొచ్చారు.. ఒక ఆడబిడ్డ ప్రజల కోసం పాదయాత్ర చేస్తే అడ్డుకోవడం, ఇలా అరెస్ట్ చేయడం అన్యాయమని చాలా మంది సానుభూతి వ్యక్తం చేశారన్నారు.. అయితే, ఈ పరిణామాలపై బీజేపీ శిబిరంలో కొంత సానుకూలత కనిపిస్తుంటే.. ప్రధాని మోడీ ఫోన్‌ చేయడం ఏంటి? అని ఆరా తీసేపనిలో అధికార టీఆర్ఎస్‌ పార్టీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • Delhi
  • phone call
  • PM Modi Phone Call to YS Sharmila
  • PM Narendra Modi

తాజావార్తలు

  • Green Moong Dal Laddu: ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు బెల్లం లడ్డు.. పిల్లల కోసం అదిరిపోయే హెల్దీ స్నాక్.!

  • CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్‌లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..

  • Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!

  • Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు

  • FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్‌గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions