PM Modi: సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
PM Modi: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కాగా.. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్, తెలంగాణ సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఘన స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం. తదితరులకు స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రధాని మోడీ నేరుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు చేరుకున్నారు.
Read also: PM Modi Tour: నగరానికి చేరుకున్న ప్రధాని.. స్వాగతం పలికిన ప్రముఖులు
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
- Off The Record : కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ఏ అంటున్న బీఆర్ఎస్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మోడీ… మోడీ… నినాదాలతో రైల్వే స్టేషన్ మారుమోగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని ఫ్లాట్ ఫాం నెంబర్ 10 వద్ద మోడీతో కలవనున్న బీజేపీ కార్యాలయ సిబ్బంది..బండి సంజయ్ చొరవతో మోడీని కలిసే అవకాశం ఉంది. తొలుత వందేభారత్ ఎక్స్ప్రెస్లోకి ప్రవేశించిన మోడీ, ఒక కోచ్లో విద్యార్థులతో సమావేశమయ్యారు. అలాగే, సికింద్రాబాద్, తిరుపతి నగరాల మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ మంగళవారం మినహా వారంలోని మిగిలిన ఆరు రోజులలో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 3 నెలల్లో రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రధాని పర్యటన దృష్ట్యా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
IPL 2023 : మ్యాచ్ కు ముందు ఇషాన్ కిషన్ తో ఎంఎస్ ధోని మాటామంతి
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!