Vijayareddy: టీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ లోకి విజయారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు ప్రారంభం అయ్యాయా? ఓ మాజీ నేత కూతురు టీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ లో కార్పోరేటర్ గా ఉన్న పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తిగా వున్నారు. ఆమెను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ తో విజయా రెడ్డి భేటీ అయ్యారు. తాను పార్టీ వీడుతున్నట్లు స్పష్టం చేసారు. గ్రేటర్ ఎన్నికల వేళ విజయా రెడ్డి డిప్యూటీ మేయర్ పదవి ఆశించారు. కానీ ఆమెకు అవకాశం దక్కలేదు. ఆ ఎన్నిక సమయంలోనే ఎన్నికల హాల్ నుంచి విజయా రెడ్డి బయటకు వెళ్ళిన సంగతి తెలిసిందే.
అప్పటినుంచి పీజేఆర్ కూతురు, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ విజయా రెడ్డి కీలక నిర్ణయం తీసుకోవడానికి వెయిట్ చేశారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి ఆమె కీ షాక్ ఇచ్చారు. తనకు పదవి దక్కకపోవడంతో అసహనంతో వున్న విజయారెడ్డిని మంత్రి తలసాని బుజ్జగించారు. అప్పట్నుంచి తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను కలిసేందుకు విజయ ఎంతో ప్రయత్నించారు. కానీ ఆమెకు అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో విజయారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నట్టు ప్రకటించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే టికెట్ విజయా రెడ్డికి ఇస్తారనే హామీతోనే ఆమె కాంగ్రెస్ లో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పోటీచేశారు. ఒకవేళ విజయారెడ్డికి టికెట్ ఇస్తే… శ్రవణ్ కి వేరే చోటు టికెట్ కేటాయించవచ్చంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు టికెట్ కేటాయింపు గురించి ఆలోచించాల్సిన సమయం కాదంటున్నారు కాంగ్రెస్ నేతలు.
Also Read
- Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
- Bans Non Dairy Paneer: తెలంగాణలో పనీర్కు బిగ్ షాక్.. ఏడాది బ్యాన్
- Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
- ED raids : హైదరాబాద్లో మరోసారి ఈడీ సోదాలు.. AMR గ్రూప్పై సోదాలు..?
ఈ నెల 23న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నానని విజయా రెడ్డి అధికారికంగా వెల్లడించారు. తన నాన్న పీజేఆర్…. కాంగ్రెస్ సీఎల్పీ లీడర్ దాకా ఎదిగారని.. తాను కూడా కాంగ్రెస్ లోనే చేరాలని నిర్ణయం తీసుకున్నానని విజయా రెడ్డి పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశానన్న ఆమె… త్వరలోనే కాంగ్రెస్ లో చేరతానన్నారు. గాంధీ ఫ్యామిలీతో తమ కుటుంబానికి అనుబంధం వుందని.. తన రాజకీయ భవిష్యత్ కాంగ్రెస్ తోనే ఉంటుందని భావిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని తన తండ్రిలాగే తాను కూడా కాంగ్రెస్ పార్టీలో వుండాలని భావిస్తున్నా అన్నారు. తన సోదరుడు పి.విష్ణువర్థన్ రెడ్డి కాంగ్రెస్ లోనే వున్న సంగతి తెలిసిందే. పీజేఆర్ తర్వాత పీవీఆర్ కాంగ్రెస్ లో పనిచేశారు. గతంలో ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. అయితే గత కొన్నాళ్ళుగా పీవీఆర్ అంత క్రియాశీలకంగా లేరు. విజయారెడ్డి ప్రవేశం అనంతరం వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి భూమిక నిర్వహిస్తారో చూడాలి మరి.
DK Aruna : మంత్రి హరీష్రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన డీకే అరుణ
తాజావార్తలు
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
-
New Excise Policy: 2026-27 ఎక్సైజ్ పాలసీ.. ఏడాది పాటు లైసెన్సులు రెన్యువల్..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?