Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. రంగంలోకి సీపీ సజ్జనార్..
- కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఫోన్ ట్యాపింగ్పై సిట్ కీలక సమావేశం
- ఇటీవల ఏర్పాటైన సిట్ అధికారులతో సీపీ సజ్జనార్ భేటీ
- ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తి స్థాయి ఛార్జ్షీట్కు ఆదేశం
- ఫోన్ ట్యాపింగ్కు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించాలని నిర్ణయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Phone Tapping : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం (SIT) మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిట్ అధికారులతో సీపీ సజ్జనార్ మొదటిసారిగా కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో కేసు పురోగతిని సమీక్షించడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ కేసులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని, వారు ఎంతటి వారైనా వదలకుండా విచారించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
గత పది రోజులుగా మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును సిట్ అధికారులు కస్టోడియల్ విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో అనేక విస్తుపోయే నిజాలు మరియు కీలక సమాచారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా, ఈ కేసులో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులతో పాటు ఇతర ఉన్నతాధికారులను కూడా విచారించేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో నడుస్తున్నందున, ప్రతి అడుగులోనూ అత్యంత జవాబుదారీతనంతో వ్యవహరించాలని మరియు ఎక్కడా చిన్న తప్పు దొర్లకుండా జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించారు.
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
విచారణ ప్రక్రియలో భాగంగా మొదట పూర్తిస్థాయి ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సిట్ కసరత్తు చేస్తోంది. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన వెంటనే, ఈ కుట్రలో భాగస్వాములైన రాజకీయ ప్రముఖులను మరియు అధికారులను వరుసగా పిలిపించి విచారించనున్నారు. ఇప్పటికే సేకరించిన ఆధారాలు, టెక్నికల్ డేటా మరియు ప్రభాకర్ రావు వాంగ్మూలం ఆధారంగా తదుపరి అరెస్టులు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈ భేటీతో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తుది దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
-
Vladimir Putin: “భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం”.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
Peddi Controversy : ‘పెద్ది’ ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్… ఏమన్నారంటే?
-
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!