Mamata Banerjee: ఢిల్లీలో సీఎం మమత.. భద్రతగా బెంగాల్ పోలీసులు.. ఏం జరుగుతోంది?
- ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం మమత టూర్
- ఢిల్లీ పోలీసులను వెళ్లిపోమన్న మమత
- భద్రతగా బెంగాల్ పోలీసులు రాక
- ఈసీ అవమానించిందన్న సీఎం మమత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం హస్తినలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ వేదికగా ‘సర్’పై పోరాటం చేస్తున్నారు. సోమవారం మమతతో పాటు మరో ఇద్దరికి ఎన్నికల సంఘం అపాయింట్మెంట్ ఇచ్చింది. దీంతో ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను మమత కలిశారు. అనంతరం ఆమె బయటకు వచ్చి జ్ఞానేష్ కుమార్ తనను అవమానించారని…అగౌరవపరిచారని ఆరోపించారు. అందుకే ఈసీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసినట్లు చెప్పారు. అయినా కూడా ఎన్నికల సంఘం నుంచి న్యాయం జరుగుతుందని ఆశించడం భ్రమ అన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనతో జ్ఞానేష్ కుమార్ చెడుగా మాట్లాడారని వ్యాఖ్యానించారు. అయితే మమత బెనర్జీ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఆమెనే టేబుల్ను గట్టిగా కొట్టి వెళ్లిపోయారని తెలిపింది.
ఇది కూడా చదవండి: Stock Market: ట్రేడ్ డీల్తో పండిన ఇన్వెస్టర్లకు పంట.. రూ.20 లక్షల కోట్ల సంపాదన
Also Read
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
- Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
ఇదిలా ఉంటే ఢిల్లీ పోలీసులపై నమ్మకం లేదో.. ఏమో తెలియదు గానీ.. ఢిల్లీలో ఉన్న బంగాల్కు చెందిన భవన్కు కాపలాగా బెంగాల్ నుంచి భద్రతా సిబ్బందిని రప్పించారు. చాణక్యపురిలోని బంగాల్ భవన్ దగ్గర బెంగాల్ పోలీసులు మోహరించారు. 22 మంది సభ్యుల బృందం నిన్న రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ పోలీసులు బెంగాల్ ప్రజలను బెదిరిస్తున్నారని మమత ఆరోపించారు. ‘‘మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు. మా ప్రజలకు ఎందుకు బెదిరిస్తున్నారు. వారు న్యాయం కోసం ఇక్కడికి వచ్చారు. అమాయక గ్రామస్తులను వేధించొద్దు.’’ అంటూ ఢిల్లీ పోలీసులపై మమత ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇది కూడా చదవండి: Lok Sabha: నరవణే పుస్తకంపై లోక్సభలో దుమారం ఎందుకు? అసలు అందులో ఏముంది?
త్వరలో బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక సర్వే చేపట్టి లక్షల ఓట్లను తొలగించింది. ఈ వ్యవహారంపై మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ తీరును తప్పుపట్టి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈసీ బృందాన్ని కలిసి ఆగ్రహం వ్యక్తం చేసి బయటకు వచ్చేశారు. మొత్తానికి ఎన్నికల ముందు ‘సర్’ వ్యవహారం దుమారం రేపుతోంది.
తాజావార్తలు
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
-
Pakistan: పాకిస్తాన్ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
-
Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!