ఫార్మా కంపెనీల కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ అయింది. దీనిపై ప్రభుత్వాన్ని నివేదిక కోరింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. తెలంగాణ కాలుష్య నియంత్ర మండలి, యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది.
జస్టిస్ కే. రామకృష్ణ, ఎక్స్పర్ట్ మెంబర్ కే. సత్యగోపాల్తో కూడిన చెన్నై-ఎన్జీటీ బెంచ్ ఈ ఆదేశాలు జారీచేసింది. తెలంగాణకు చెందిన గుమ్మి నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టింది ట్రిబ్యునల్. ఫిర్యాదు చేసినప్పటికీ ఫార్మా కంపెనీల కాలుష్యంపై సంబంధిత ప్రభుత్వ విభాగాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు నరేందర్ రెడ్డి.
కాలుష్యకారక సంస్థలపై చర్యలతో పాటు, ఆ కాలుష్యం కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు నరేందర్ రెడ్డి. ఈ పిటిషన్ పై తదుపరి విచారణ మార్చి 3కు వాయిదా వేసింది ఎన్జీటీ న్యాయస్థానం.