కరోనా మహమ్మారి కారణంగా కొన్ని పరీక్షలు రద్దు చేసింది ప్రభుత్వం.. మరికొన్ని పరీక్షలు వాయిదా వేస్తూ వచ్చింది.. ఇక, తెలంగాణ ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది విద్యాశాఖ.. అయితే, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తల్లిదండ్రులు సంఘం ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించింది.. ఇప్పటికే ప్రమోట్ అయిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించొద్దని కోర్టును కోరారు పిటిషనర్.. పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పాస్ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది రాపోలు భాస్కర్.. హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, ఇప్పటికే ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం.. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో.. తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, ఇంటర్ విద్యాశాఖ అధికారులకు కీలక సూచనలు చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.