Gurukulam : సిర్రెత్తిన సిబ్బంది.. అధికారిపై కక్షతో తాగునీటిలో పురుగుల మందు
- గురుకుల పాఠశాలలో తాగునీటిలో పురుగుల మందు కలపడంతో కలకలం
- ప్రత్యేక అధికారిపై కక్షతో ఉపాధ్యాయుల నిర్వాకం
- ముగ్గరు టీచర్లు, ఒక వంట మనిషి సస్పెన్షన్లో
- జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు.. విద్యార్థుల భద్రతపై దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurukulam : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఘటన ఒక్కసారిగా విద్యా వర్గాలను, తల్లిదండ్రులను, ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన గురుకుల పాఠశాలలోనే కొందరు సిబ్బంది తమ కక్షసాధింపుకై తాగునీటిలోనే పురుగుల మందు కలపడం కలకలం రేపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పరిధిలోని ఒక గురుకుల పాఠశాలలో ఈ దారుణం జరిగింది. పాఠశాలలో ప్రత్యేక అధికారి (Special Officer) పట్ల కక్ష పెంచుకున్న నలుగురు సిబ్బంది ఆవేశపూరితంగా తాగునీటిలో పురుగుల మందు కలిపినట్టు ఆరోపణలు ఉన్నాయి. అరాచకానికి పాల్పడిన వారిలో ముగ్గురు ఉపాధ్యాయులు, ఒక వంటమనిషి ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి, కేవలం వ్యక్తిగత విభేదాలకే ఇంతటి ఘోర చర్యకు పాల్పడటం అందరినీ షాక్కు గురి చేసింది.
KA Paul : సహస్ర కేసులో ఓ చట్టాన్ని తీసుకురావాలి
Also Read
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
అదృష్టవశాత్తూ ఈ విషయం సకాలంలో వెలుగులోకి రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యార్థులు ఆ నీటిని తాగకముందే ఘటన బహిర్గతం కావడంతో ప్రాణనష్టం జరగలేదు. లేకపోతే వందలాది విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉండేది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. తాగునీటిలో పురుగుల మందు కలిపిన సిబ్బందిపై వెంటనే కఠిన చర్యలు తీసుకున్నారు. ముగ్గురు ఉపాధ్యాయులు, వంటమనిషిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఈ ఘటనపై విస్తృత దర్యాప్తు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సంఘటనతో తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్ని చదివించి మనిషి చేయాలనే ఆశతో గురుకుల పాఠశాలలో చేర్పిస్తే, అక్కడి సిబ్బందే ఇలా ప్రాణాలకు తెగబడటం భయానకమని అంటున్నారు. ఇలాంటి వారిపై కఠిన శిక్షలు విధించకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఘటన వెలుగులోకి రాగానే గురుకుల పాఠశాలల్లో భద్రత, పర్యవేక్షణ పట్ల ప్రజల్లో సందేహాలు మొదలయ్యాయి. తాగునీరు, ఆహారం వంటి విషయాల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే విద్యార్థుల ప్రాణాలు హరించబడతాయని, కఠిన నియమావళి అమలు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. “పిల్లలను భవిష్యత్తు కోసం హాస్టల్లో పెడతాం కానీ ఇలాంటి ఘటనలు వినిపిస్తే గుండె కణతలాడుతుంది. నిందితులపై కఠిన చర్యలు తీసి పాఠశాలల్లో భద్రతా చర్యలు పెంచాలి” అని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Botsa Satyanarayana : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేకరణను అడ్డుకుంటామన్న కూటమి నేతలు ఎటు పోయారు
తాజావార్తలు
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!