Palla Rajeshwar Reddy: రేవంత్ రెడ్డికి పల్లా సవాల్.. వాటిపై కేంద్రాన్ని ప్రశ్నించు చూద్దాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palla Rajeshwar Reddy: శాసన మండలి మీడియా పాయింట్ లో రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో ప్రగతిభవన్ ను పేల్చివేయాలని వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీలు అందరూ కలిసి డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. పీడీ యాక్ట్ పెట్టాలని కోరుతామన్నారు. రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ లోక్ సభ స్పీకర్ కు విజ్ఞప్తి చేస్తామన్నారు. ములుగు జిల్లాలో అభివృద్ధి పనుల పై కూడా తప్పుగా మాట్లాడారని మండిపడ్డారు. ములుగు జిల్లాను సీఎం కేసీఆర్ ఏర్పాటుచేశారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ పై కూడా వ్యాఖ్యలు చేశారు. వర్సిటీకి సంబంధించిన భూమిని సేకరించడం జరిగిందని తెలిపారు. వర్సిటీపై పార్లమెంట్ లో మాట్లాడాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మృత్యుశయ్యపై ఉందని ఎద్దేవ చేశారు. వర్సిటీ భూమి, భవనాలు వివరాలు ఇస్తాం.. వాటిపై కేంద్రాన్ని ప్రశ్నించు అంటూ సవాల్ విసిరారు. సీనియర్లను కాదని ఒక బ్లాక్ మెయిలర్ ను పీసీసీ అధ్యక్షుడుగా పెట్టుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Bhatti Vikramarka: టాక్స్ రెవెన్యూ 40 వేలకోట్లా!.. టాక్స్ వేశారా? వేయాలని ఆలోచిస్తున్నారా?
Also Read
ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ను మావోయిస్టులు పేల్చివేయాలని నిన్నటి పాదయాత్రలో టీపీసీసీ రేవంత్ రెడ్డి మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో దొరల గడిలను కూల్చివేసిన మావోయిస్టులు ప్రగతి భవన్ కూడా కూల్చివేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్ ఉంటే ఏంది, లేకుంటే ఏంది… అందుకే మావోయిస్టులు డైనమేట్లు పెట్టి ప్రగతి భవన్ ను పేల్చివేస్తే మాకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే రేవంత్ రెడ్డి నిన్న ములుగులో చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యేలు పిలుపునిస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి మీద పీడీ యాక్ట్ నమోదుచేయాలని ములుగు పోలీసులకు బీఆర్ఎస్ నాయకులు పిర్యాదు చేసారు. రేవంత్ రెడ్డి యాత్రను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనితో రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి యాత్రపై ఉత్కంఠంగా మారింది. ఇప్పటికే ములుగు పోలీసు స్టేషన్ లో రేవంత్ రెడ్డి కామెంట్స్ పైనా బీఆర్ఎస్ శ్రేణులు పిర్యాదు చేయగా ఇక నర్సంపేట్ నియోజకవర్గం వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు రెడీ అయ్యారు.
MLA’s Purchase: ఎమ్మెల్యేల ఎర కేసు.. 17న విచారిస్తామన్న సుప్రీం కోర్టు
తాజావార్తలు
-
Pooja Hegde : 18 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఇలా ఉందేంటి
-
Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే మూల్యం చెల్లించక తప్పదు!
-
Ajith Kumar: ‘డేర్డెవిల్’గా దూసుకొస్తున్న అజిత్.. మళ్లీ అధిక్ రవిచంద్రన్తో చేతులు కలిపిన స్టార్ హీరో!
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!