Palla Rajeshwar Reddy : ప్రతి రైతు ఇంటిపై నల్లజెండాలు ఎగురాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధాన్యం కొనుగోళ్లపై ఇంకా స్పష్టత నెలకొన లేదు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు జరుపాలంటూ టీఆర్ ఎస నేతలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తుంటే.. తెలంగాణ బీజేపీ నేతలేమో కేంద్రం ధాన్యం కొంటామన్నా టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. పంజాబ్ లో ఏవిధంగానైతే ధాన్యం కొంటున్నారో.. అదే విధంగా తెలంగాణలో యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశంలో మేము ప్రజలము కాదా? ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో ఒకటి మాట్లాడితే రాష్ట్రంలో మరోటి మాట్లాతుండ్రు అని, యాసంగిలో కేంద్రం వడ్లు కొనదు అంటే, కేసీఆర్ వరి వెయ్యొద్దు అని రైతులకు చెప్పారన్నారు.
కానీ తెలంగాణ బీజేపీ నేతలు వరి వేయాలంటూ కేంద్రం కొంటుందని అబద్దపు ప్రచారాలు చేయడంతో.. 15 లక్షల మంది వరికి బదులు వేరే పంటలు వేసుకున్నారన్నారు. కానీ.. 35 లక్షల మంది రైతులు వరి పంట వేసి మోసపోయారన్నారు. తెలంగాణ కోసం ఎలా పోరాటాలు చేసామో.. తెలంగాణలోని వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రంపై పోరుకు సిద్ధం కావాలన్నారు. ఈ నెల 7న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని, 8న గ్రామాల్లో ప్రతి రైతు ఇంటిపై నల్లజెండాలు ఎగురాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయాలన్నారు. యాసంగి పంట ను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read
https://ntvtelugu.com/ts-edcet-2022-shcedule-release/
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!